Atrocious: పల్నాడులో దారుణం.. అత్తింటి వారిని హత్య చేసిన కోడలి తరుపు బంధువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime news: అత్తింటి కాపురం కత్తి మీద సాము లాంటిది అంటారు మన పెద్దలు. అయితే కూతురును అత్తింటి వారు వేధిస్తున్నారని ఆ అత్తింటి వారినే కత్తులతో పొడిచి కడతేర్చారు ఓ కోడలి తరుపు బంధువులు. ఈ ఘటన పల్నాడులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. పల్నాడు జిల్లా లోని పిడుగురాళ్ల మండలం లోని కొనంకిలో దారుణ హత్య వెలుగు చూసింది. పల్నాడు జిల్లా లోని ముప్పాళ్ళ మండలం దమ్మలపాడుకు చెందిన మాధురికి పిడుగురాళ్ల మండలం కొనంకి చెందిన అనంతం నరేష్ తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కోటి ఆశలతో అత్తింటిలో అడుగు పెట్టిన మాధురికి తన ఆశలు అడియాశలై అత్తింటి వేధింపులు ఎదురైయ్యాయి.
Read also:Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం.. మళ్లీ నిలిచిపోయిన పనులు
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మాధురి, నరేష్ ల మధ్య కుటుంబ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మధురికి అత్తింటి వారి నుండి వేధింపులు ఎక్కువ కావడం చేత పెద్దల సమక్షంలో చర్చించుకునేద్దుకు మాధురి తరుపు బంధువులు కొణంకి వచ్చారు. ఈ క్రమంలో మాధురి అత్తింటి వారికి పుట్టింటి వారికి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం కావడం చేత ఇరువురి మధ్య మాట మాట పెరిగింది. చినుకు చినుకు కలిసి గాలివానగా మారినట్టు ఇరువురి మధ్య మాట మాట పెరిగి వివాదానికి దారితీసింది. దీనితో అమ్మాయి తరపు బంధువులు విచక్షణ కోల్పోయారు. కూతురు జీవితం నాశనం అవుతుందని కూడా ఆలోచించకుండా కూతురి భర్తను, అత్త మామలను కత్తులతో పొడిచి చంపారు. కాగా ఈ ఘటనలో మరణించిన మృతుల వివరాలు అనంతం నరేష్ (30), ఆదిలక్ష్మి,(50) సాంబయ్య , (56).
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..