Ashokgajapathi Raju: భావితరాలకు భారంగా అప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పెరిగిపోతున్న అప్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో అవినీతి ఎక్కువగా పెరిగి పోయింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సైనికులు ఆయుధాల్లో కూడా అవినీతి చేశారు. అలాంటి సమయంలో 105 ఎంపీల చేత రాజీనామలు చేయించి కాంగ్రెస్ కి తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. జైల్లో ఉన్న నేరస్థుడ్ని ముఖ్యమంత్రిని చేశారు. రూ.43 వేల కోట్లను మింగిన వ్యక్తికి అధికారం అప్పజెప్పారు. భావి తరాలపైన కూడా అప్పులు పడే విదంగా వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తుందని విమర్శించారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు.
కర్ఫ్యూకి కారకులైన నాయకులు మాకు నేర్పిస్తారా…మమ్మల్ని భయపెడతారా? మహాత్మా గాంధీ కూడా జైలుకు వెళ్లారు. కానీ ఏ రోజు భయపడలేదు. అన్నగారి పౌరుషంతో బ్రతికారు. అలానే మనం కూడా బ్రతకాలి. స్థానిక ఎమ్మెల్యే మూర్ఖత్వంతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తలు ఒక వారధి లాంటివారు. తెల్ల దొరలు భయపెట్టినట్టు ప్రతీ విషయంలో వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండని హెచ్చరిస్తున్నా అన్నారు అశోక్ గజపతిరాజు. చేసిన పనిలో పెద్దరికం ఉంటుంది. కావున మన ధర్మం ఏంటనేది మనం ఆలోచించుకుని పని చేయాలి. జైల్లో ఉండవలిసిన వాడు బెయిలుపై వచ్చి మన భవిష్యత్ ను, మన పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల్లో గమ్మత్తైన పరిస్థితులను చూస్తున్నాం.
ఎంతో మంది ప్రముఖల స్ఫూర్తితో 40 ఏళ్ల కిందట తెలుగు వాళ్ల కోసం టీడీపీని స్థాపించారు. దేశంలో రాజకీయాల్లో ప్రభావాన్ని తీసుకు వచ్చిన ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎవరి కంటే తక్కువ కాదని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని శ్లాఘించారు. ఒట్టి మాటలు కట్టిపెట్టు..గట్టి మేలు తలపెట్టవోయ్ .అంటూ గురజాడ మాటలను గుర్తు చేస్తున్నా అన్నారు అశోక్ గజపతిరాజు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పని చేస్తే టీడీపీ కి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!