Ashok Gajapathi Raju: వెనుకబడిన వర్గాలకు, మహిళలకు.. టీడీపీ అవకాశాలిచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gajapathi Raju On 40 Years Of TDP: తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించారో.. నేటికీ అలాగే నడుస్తోందన్నారు. ఈ సుదీర్ఘ చరిత్రలో అనేకసార్లు అధికారంలోకి వచ్చామని, ప్రతిపక్షంలోనూ ఉన్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు, మహిళలకు టీడీపీ అవకాశాలు కల్పించిందని చెప్పారు. భాషని, సంస్కృతిని కాపాడటంలో టీడీపీ క్రియాశీలక పాత్ర పోషించిందని.. అనేక ఉద్యమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సైతం చేపట్టిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రివర్స్ గేర్లో వెళుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న డబ్బుల్ని కూడా నొక్కేస్తున్నారు అశోక్ గజపతి రాజు ఆరోపించారు. వికేంద్రీకరణ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. పన్నులుతో బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతోందని మండిపడ్డారు. బ్రిటీష్ కాలం నాటి నియంత చట్టాలను తీసుకొస్తున్నారని.. జీవో నం.1తో ప్రతిపక్షాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని, ఏపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉండటం వల్లే రాష్ట్రం దేశంలోనే వెనుకబడిపోయిందని చెప్పారు. నిధుల్ని పక్కదారి పట్టిస్తూ, నీతులు చెప్పడం విడ్డూరమన్నారు.
Also Read
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికపై మాట్లాడుతూ.. ఆ ఇద్దరిపై విమర్శలు చేసిన మంత్రులకు విజ్ఞత లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అశోక్ గజపతి రాజు కౌంటర్ వేశారు. పవన్, చంద్రబాబు కలవడం ఇదేం మొదటిసారి కాదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక పనులుపై తామెప్పుడూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమీ ముందుకు సాగడం లేదని ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!