AshokGajapathi Raju: ఏపీలో రాజ్యాంగం అమలు కావడంలేదు
Ashok Gajanatphi Raju comments on mahapadayatra
ఏపీలో అమరావతి రైతుల మహాపాదయాత్ర వివాదాస్పదం అవుతోంది. పాదయాత్రపై దాడులు జరగడం, తాజాగా హైకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో వారం పాటు తాత్కాలిక విరామం ప్రకటించారు అమరావతి రైతులు. మహాపాద యాత్రను అడ్డుకుని ఐడి కార్డులు అడుగుతున్నారు. ప్రభుత్వ వ్యవహారంతో పోలీసులు నవ్వులు పాలవుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత కుటుంబ సభ్యులు సంబంధించిన కేసు ట్రైల్ రన్ కు కూడా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిని చిన్నికుమారి లక్ష్మి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిటీబ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతి రాజు, జిల్లా నేతలు పాల్గొన్నారు.
Read Also: Controversy: కరెన్సీ నోట్లపై నేతాజీ బొమ్మ ముద్రించాలి.. హిందూ మహాసభ వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
అనంతరం అశోక్ మాట్లాడుతూ..,గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు సపోర్ట్ చేశాం. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థినిగా టీడీపీ తరపున చిన్నికుమారి లక్ష్మీని బరిలో నిలిపాం. ప్రతీ ఒక్కరూ టీడీపీకి సపోర్ట్ చేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అమరావతి రైతుల పాదయాత్ర పై అశోక్ స్పందిస్తూ., రైతులు చేస్తున్న యాత్రను అడ్డుకుని ఐడి కార్డులు అడుగుతున్నారు. ప్రభుత్వ వ్యవహారంతో పోలీసులు నవ్వులు పాలవుతున్నారని అశోక్ గజపతిరాజు వాపోయారు.
స్వతంత్ర దేశంలో… స్వతంత్ర భావాలను లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నారు. ప్రతీ ఒక్కరినీ భయపెడుతున్నారు. ఏపీలో రాజ్యాంగo అమలు కావడం లేదని రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులే అంటున్నారని అశోక్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్ట్ ఈ వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో మొట్టి కాయలు వేసింది . ఐనప్పటికీ మార్పు లేదన్నారు. మహనీయులను గౌరవించుకోవడం కోసమే పేర్లను పెట్టుకుంటాం, ఉన్న సంస్కృతిని పాడు చేయొద్దని అశోక్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read ALso: T20 World Cup: కాన్వే 92 నాటౌట్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!