APSRTC: ప్రయాణికులపై భారం.. ఛార్జీలు 20శాతం పెరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగాయి. తానేం తక్కువ తినలేదని APSRTC నిరూపిస్తోంది.ప్రయాణికులపై మరోసారి డిజీల్ సెస్ వేసింది ఏపీఎస్ ఆర్టీసీ. ఏప్రిల్ నెలలో డిజీల్ సెస్ వేసింది ఆర్టీసీ.విధిలేని పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ మళ్లీ విధించక తప్పడం లేదని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కిలోమీటర్ల ప్రాతిపదికన డీజిల్ సెస్ వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. విద్యార్ధుల బస్ పాస్ ఛార్జీలు 20 శాతం మేర పెరిగే అవకాశం వుంది.
డీజిల్, స్పేర్ పార్ట్స్, నిర్వహణ ఖర్చులు పెరగడంతో సెస్ పెంచక తప్పడం లేదంటోంది ఆర్టీసీ. పెరిగిన డీజిల్ ధరల కారణంగా రోజుకు అదనంగా రూ. 2.50 కోట్లు అదనపు భారం పడుతోందని వెల్లడిస్తోంది. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాలని ఆర్టీసీ కోరుతోంది.రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి పెరిగిన ఆర్టీసీ ధరలు.కిలోమీటర్ల ప్రాతిపదిన సెస్ విధింపునకు నిర్ణయంతో భారీగా టిక్కెట్ ధరలు పెరిగే అవకాశం వుంది. పల్లె వెలుగు కనీస చార్జీ రూ. 10, పల్లె వెలుగులో తొలి 30 కి.మీ వరుకు నో సెస్. పల్లె వెలుగులో 35-60 కి.మీ వరకు అదనంగా మరో రూ. 5 డీజిల్ సెస్ విధించింది.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
పల్లె వెలుగులో 60-70 కిలో మీటర్లు రూ. 10 మేర డీజిల్ సెస్ వుంటుంది. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులలో ప్రస్తుతం టికెట్పై రూ. 5 డీజిల్ సెస్ వసూలు చేస్తోంది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు నో సెస్. 31-65 కి.మీ వరకు మరో రూ. 5 మేర డీజిల్ సెస్ విధించనుంది. 66-80 కిలోమీటర్ల వరకు మరో రూ. 10 డీజిల్ సెస్ వుంటుంది. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులలోనూ టికెట్పై రూ. 10 డీజిల్ సెస్ వసూలు చేయనుంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కిలో మీటర్లు వరకు నో సెస్. హైదరాబాద్ -విజయవాడ సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 70 సెస్ విధించనుంది. హైదరాబాద్- విజయవాడ అమరావతి బస్సుల్లో రూ. 80 డీజిల్ సెస్ విధించనుంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో సతమతం అవుతున్న వారికి ఇదో అదనపు భారం కానుంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!