Vijayawada: ఏపీ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ అనుమానాస్పద మృతి.. హోటల్ రూమ్లో మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఆంధ్రప్రదేశ్ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ అనుమానాస్పద మృతిచెందారు.. విజయవాడలోని డీవీ మనార్ హోటల్లోని రూంలో విగతజీవిగా పడి ఉన్న శివ కుమార్ రాజు ( 74 )ను గుర్తించారు హోటల్ సిబ్బంది.. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉండే ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ గా గుర్తించారు.. అయితే, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు బంధువులు చెబుతున్నారు.. పాత కేసుల ఎవిడెన్స్ కోసం కోర్టుకు హాజరు నిమిత్తం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లిన శివకుమార్ రాజు.. ఈ నెల 5వ తేదీన హోటల్లో రూమ్లో దిగారు.. అయితే, ఉదయం నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా, బెల్ కొట్టినా శివకుమార్ రూమ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది.. మారు తాళం పెట్టి గదిలోకి వెళ్లి చూడగా.. నుదిటి మీద గాయంతో విగతజీవిగా పడిఉండడాన్ని గమనించారు.. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మాచవరం పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Nandamuri Balakrishna: బాలయ్య హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
ఇక, ఘటనా స్థంలో క్లూస్ సేకరించారు పోలీసులు.. మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు, ట్యాబ్లెట్స్ గుర్తించారు.. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఈ విషయంపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. దీంతో, హైదరాబాద్ నుండి విజయవాడ బయల్దేరి వెళ్లారు కుటుంబ సభ్యులు.. కాగా, హైదరాబాద్లోని మలేషియా టౌన్షిప్లో నివాసం ఉండేవారు శివకుమార్ రాజు.. ఉమ్మడి రాష్ట్రంలో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా పనిచేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత బంజారాహిల్స్ లో ఉన్న ఓ ల్యాబ్స్లో పనిచేస్తున్నారు. విజయవాడ కోర్టులో వాయిదా కోసం.. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఎంజీ రోడ్డులోని హోటల్ రూమ్లో బస చేశారు.. శనివారం ఉదయం అల్పాహారం ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్ సిబ్బంది తలుపుకొట్టారు. ఆయన తీయకపోవడంతో బయటకు వెళ్లి ఉంటారని భావించారు. మళ్లీ మధ్యాహ్నం 1గంటకు గది ఖాళీ చేస్తారో, ఉంటారో తెలుసుకోవడానికి ఇంటర్కంకు ఫోన్ చేశారు. ఆయనా ఆయన నుంచి స్పందనలేదు.. దీంతో సిబ్బంది మాస్టర్ కీ తీసుకుని తలుపు తీసి చూడగా శివకుమార్ చనిపోయి ఉన్నాడు..
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!