AP Tenth Paper Leak: నంద్యాలలోనూ పేపర్ లీక్ కలకలం.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బుధవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయ్యిందని వదంతులు రాగా కలెక్టర్ హరినారాయణ స్పందించి వాటిని ఖండించారు. తాజాగా నంద్యాల జిల్లాలోనూ టెన్త్ ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాచ్ మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3 నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఎంఈవో శ్రీధర్రావు విచారణ చేపట్టారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాఠశాల ఇన్విజిలేటర్, సూపర్వైజర్ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.
కాగా పదో తరగతి పేపర్ లీక్ అయిందన్న ప్రచారంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది. పేపర్ లీకేజీ వార్తలు నిజం కాదని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాన్ని వైరల్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నాపత్రం బయటకొచ్చింది కాబట్టి లీక్గా పరిగణించలేమని తెలిపారు. పరీక్ష ఉదయం 9:30 గంటలకు మొదలైతే.. 11 గంటలకు పేపర్ లీక్ అనే ప్రచారం జరిగిందని.. ఉ.11 గంటలకు ఎవరో పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రశ్నా పత్రాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటారన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండంలోని అంకిరెడ్డి పల్లి జెడ్పీ పాఠశాల నుంచి ప్రశ్నా పత్రం బయటకు వచ్చిందని గుర్తించామని.. సోషల్ మీడియాలో పేపరును వైరల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ ఘటనలో చీఫ్ సూపర్ వైజర్, ఇన్విజిలెటర్లను బాధ్యులుగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
Andhra Prasesh: పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ కలకలం.. స్పందించిన కలెక్టర్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!