AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!
- ఇంటి నుంచే 10 నిమిషాల్లో పోలీస్ ఫిర్యాదు నమోదు
- వయస్సుకు తగ్గట్టు మాట్లాడే స్మార్ట్ ఏఐ టెక్నాలజీ
- పోలీస్ స్టేషన్ భయం లేకుండా డిజిటల్ కంప్లైంట్ సౌకర్యం
- త్వరలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలు , వృద్ధుల కోసం ఒక విప్లవాత్మకమైన ఏఐ (AI) సిస్టమ్ను అభివృద్ధి చేశారు. సాధారణంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే చాలా మంది భయపడతారు లేదా మొహమాటపడతారు. ఈ ఇబ్బందులను తొలగిస్తూ, ఇంట్లో కూర్చునే కేవలం 10 నిమిషాల్లో ఫిర్యాదు నమోదు చేసే సాంకేతికతను వీరు అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యార్థులు తయారు చేసిన సిస్టమ్ ఒక మనిషిలాగా ఎదుటివారితో మాట్లాడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, మాట్లాడే వ్యక్తి వయస్సును బట్టి ఇది తన సంభాషణను మార్చుకుంటుంది. చిన్న పిల్లలు ఫిర్యాదు చేయాలనుకుంటే వారి మానసిక స్థితికి తగ్గట్టుగా సున్నితంగా మాట్లాడుతుంది. పెద్దవారు లేదా వృద్ధులతో వారి స్థాయికి తగినట్లుగా సంభాషించి వివరాలను సేకరిస్తుంది.
Janasena MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు..
Also Read
- NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
- Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
- Fire Accident: ఆటోనగర్లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
- BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
సాధారణంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలంటే సుమారు మూడు గంటల సమయం పడుతుంది. కానీ ఈ ఏఐ సిస్టమ్ ద్వారా కేవలం 10 నిమిషాల ఫోన్ కాల్ లేదా సంభాషణతో పూర్తి వివరాలను సేకరించి, ఆటోమేటిక్గా కంప్లైంట్ ఫైల్ చేసి సంబంధిత పోలీస్ అధికారులకు పంపిస్తుంది. దీనివల్ల పోలీస్ స్టేషన్కు వెళ్లాలనే భయం ఉండదు , బాధితులు ఎంతో కంఫర్టబుల్గా తమ సమస్యను చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ వాట్సాప్ వాడుతున్నందున, ఈ ఏఐ సిస్టమ్ను వాట్సాప్లోకి ఇంటిగ్రేట్ చేయనున్నారు. దీనివల్ల ప్రజలు మరింత సులభంగా, ఒక మెసేజ్ లేదా వాయిస్ నోట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసే వీలుంటుంది. ఈ వినూత్న ఆవిష్కరణ భవిష్యత్తులో పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని, ముఖ్యంగా బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!