Kundu couple: దీదీ తృణమూల్ను తుత్తునకలు చేసిన కుందు దంపతులు? ఒక సాదాసీదా పార్టీని లోక్సభలోనే కింగ్ మేకర్గా ఎలా మార్చారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kundu couple NCPI: దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ సాధారణ ప్రాంతీయ పార్టీ, రాత్రికి రాత్రే లోక్సభలో ఐదో అతిపెద్ద శక్తిగా అవతరించబోతోంది. కేవలం 822 ఓట్లు, రూ. 1.13 లక్షల విరాళాల రికార్డు మాత్రమే ఉన్న ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) ఇప్పుడు దేశ అధికార పీఠాన్ని శాసించే స్థాయికి చేరిందంటే నమ్మగలమా. కానీ ఇది నిజం.. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి చెందిన సుమారు 20 మంది అసమ్మతి ఎంపీలు ఈ పార్టీలో విలీనం కావాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. ఈ విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం లభిస్తే.. కూటమిలో బీజేపీ తర్వాత ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో ఎన్సీపీఐ రెండో అతిపెద్ద పార్టీగా మారుతుంది.
జీరో నుంచి టాప్-5 లోకి
జనవరి 2023లో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన ఈ గుర్తింపు లేని చిన్న పార్టీకి ప్రస్తుతం లోక్సభలో ఒక్క సీటు కూడా లేదు. అయితే టీఎంసీ తిరుగుబాటు ఎంపీల చేరికతో దీని బలం ఒక్కసారిగా 20కి చేరనుంది. దీంతో లోక్సభలో బీజేపీ (240), కాంగ్రెస్ (99), సమాజ్వాదీ పార్టీ (37), డీఎంకే (22)ల తర్వాత ఎన్సీపీఐ 5వ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మరోవైపు 28 మంది ఎంపీలతో 4వ అతిపెద్ద ప్రతిపక్షంగా ఉన్న టీఎంసీ బలం కేవలం 9 సీట్లకు పడిపోనుంది. ఎంపీలంతా అనర్హత వేటు పడకుండా యాంటీ డిఫెక్షన్ (ఫిరాయింపుల నిరోధక) చట్టం నుంచి తప్పించుకోవడానికే ఈ వ్యూహాత్మక విలీన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
ఎవరీ కుందు దంపతులు?
ఈ వ్యూహాకత్మక రాజకీయ మలుపు వెనుక ఉత్తర బెంగాల్కు చెందిన ఉత్తీయ కుందు, షెవ్లీ కుందు దంపతులు ఉన్నారు. ఉత్తీయ కుందు ఈ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఆయన భార్య షెవ్లీ ట్రెజరర్గా ఉన్నారు. బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారితో ఉత్తీయ కుందుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విలీనంపై పార్టీ వ్యవస్థాపకుడు శంతను దేవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. దంపతులు ఇద్దరూ ఏకపక్షంగా, పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా తమను చీకట్లో ఉంచి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
తెరవెనుక బీజేపీ హస్తం..
ఈ ఆకస్మిక రాజకీయ పరిణామాల వెనుక కేంద్ర అధికార పార్టీ బీజేపీ వ్యూహం ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో తిరుగుబాటు ఎంపీలతో నిషికాంత్ దూబే, సీఎం రమేష్, సువేందు అధికారి వంటి బీజేపీ అగ్రనేతలు రహస్య సమావేశాలు జరిపినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈ అక్రమ విలీన డ్రామా నడుస్తోందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఏదేమైనా, ఒక చిన్న అనామక పార్టీ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఇంత పెద్ద శక్తిగా మారడం దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత అరుదైన వింతగా నిలిచిపోనుంది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!