CM Chandrababu: సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రముఖ సంస్థలతో కీలక సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల గురించి ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.
ఇక, పర్యటన మొదటి రోజున ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ YCH లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు, ఆధునిక సాంకేతికతతో కూడిన మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా ఇరు వర్గాలు చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వివరించారు.
Also Read
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు వెయ్యి కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ సముద్ర తీరం ఉందని తెలిపారు. లాజిస్టిక్స్ రంగ అభివృద్ధికి అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. హార్టికల్చర్ రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఆక్వాకల్చర్ రంగంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ ద్వారా ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. లాజిస్టిక్స్ మాత్రమే కాకుండా ఉత్పత్తి రంగంలో కూడా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పెట్టుబడి అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని, ఆంధ్రప్రదేశ్ను సందర్శించి పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
-
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
-
Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్ల వెనుక అసలు కథ ఇదే!
-
TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!