CM Chandrababu: సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రముఖ సంస్థలతో కీలక సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల గురించి ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.
ఇక, పర్యటన మొదటి రోజున ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ YCH లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు, ఆధునిక సాంకేతికతతో కూడిన మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా ఇరు వర్గాలు చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వివరించారు.
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
- AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు
- IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
- AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు వెయ్యి కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ సముద్ర తీరం ఉందని తెలిపారు. లాజిస్టిక్స్ రంగ అభివృద్ధికి అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. హార్టికల్చర్ రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఆక్వాకల్చర్ రంగంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ ద్వారా ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. లాజిస్టిక్స్ మాత్రమే కాకుండా ఉత్పత్తి రంగంలో కూడా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పెట్టుబడి అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని, ఆంధ్రప్రదేశ్ను సందర్శించి పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
-
Rajendra Prasad: ‘అడిగి తీసుకుంటే అది భిక్షే’.. పద్మశ్రీపై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: జూలై 7 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!