సీఎం వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు.. ఆ తర్వాత గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచగ్రామాల భూసమస్య అన్నది నేను పుట్టక ముందునుంచే ఉందన్నారు.. వైసీపీ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్న ఆయన.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి పునాది రాళ్లు సమాధి రాళ్లుగానే మిగిలాయని విమర్శించారు.. ఈ ప్రభుత్వం అభివృద్ధి దిశగా నడుస్తోంది. ప్రతిపక్షం మాట్లాడే అర్ధరహిత వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు స్పీకర్ తమ్మినేని.. ఇక, మాన్సాస్ ట్రస్ట్ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి.. న్యాయస్థానమే నిర్ణయిస్తుందన్నారు.