Andhra Pradesh: సీపీఎస్ అంశంపై కొత్త సంఘం ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయం, అసెంబ్లీలోని ఉద్యోగులు అంతా కలిసి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్గా ఉద్యోగులు ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ మాట్లాడుతూ… పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించింది. కనీసం సీపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని తెలిపింది. ప్రభుత్వ తీరుతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని పేర్కొంది. 2022 మార్చి నుంచి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ప్రాన్ ఖాతాలో జమ కావడం లేదని.. దీనిపై ప్రభుత్వం ఆదాయపు పన్ను ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించింది.
Read Also: Rare Disease: అరుదైన వ్యాధి.. ఈ వ్యక్తికి శరీరమంతా వెంట్రుకలే..!!
Also Read
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రభుత్వ వాటాను రాష్ట్రంలో అమలు చేయకపోవడం చాలా దారుణమని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే తేల్చి చెప్పామని.. రాజకీయ కారణాలతో అయినా ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సీపీఎస్లో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని.. వాళ్లకు వచ్చే రూ.1000-1500 పెన్షన్ డబ్బులు మందుల ఖర్చుకు కూడా సరిపోవడం లేదని.. ఎటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం దుర్భరంగా తయారైందని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ సభ్యులు కోట్ల రాజేష్, అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు పూనుకున్నాయని గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయంగా ప్రశంసించారు.

తాజావార్తలు
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!