Andhra Pradesh: సీపీఎస్ అంశంపై కొత్త సంఘం ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయం, అసెంబ్లీలోని ఉద్యోగులు అంతా కలిసి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్గా ఉద్యోగులు ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ మాట్లాడుతూ… పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించింది. కనీసం సీపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని తెలిపింది. ప్రభుత్వ తీరుతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని పేర్కొంది. 2022 మార్చి నుంచి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ప్రాన్ ఖాతాలో జమ కావడం లేదని.. దీనిపై ప్రభుత్వం ఆదాయపు పన్ను ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించింది.
Read Also: Rare Disease: అరుదైన వ్యాధి.. ఈ వ్యక్తికి శరీరమంతా వెంట్రుకలే..!!
Also Read
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రభుత్వ వాటాను రాష్ట్రంలో అమలు చేయకపోవడం చాలా దారుణమని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే తేల్చి చెప్పామని.. రాజకీయ కారణాలతో అయినా ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సీపీఎస్లో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని.. వాళ్లకు వచ్చే రూ.1000-1500 పెన్షన్ డబ్బులు మందుల ఖర్చుకు కూడా సరిపోవడం లేదని.. ఎటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం దుర్భరంగా తయారైందని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ సభ్యులు కోట్ల రాజేష్, అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు పూనుకున్నాయని గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయంగా ప్రశంసించారు.

తాజావార్తలు
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
ట్రెండింగ్
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..