Telangana Power Generation:శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ జలజగడం మొదలయింది. భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి నీళ్లొచ్చాయో లేదో….అప్పుడే ఏపీ, తెలంగాణ మధ్య వివాదం మొదలైంది. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి దిగువకు నీరు విడుదల చేయడం వివాదాస్పదమవుతోంది. తెలంగాణ నిబంధనలు అతిక్రమించి శ్రీశైలం జలాలను వినియోగిస్తోందని కృష్ణ యాజమాన్యం బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది.
Bunny Vasu: నిర్మాత బన్నీవాసుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన సాగునీరు, తాగునీటి అవసరాలకు నిర్మించిన ప్రాజెక్టులకు నీరందాలంటే 854 అడుగుల నీటి మట్టం కొనసాగించాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేయాలన్నా శ్రీశైలం డ్యామ్ లో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలి. శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 854 అడుగులు మెయింటెయిన్ చేయాలని కృష్ణ నది యాజమాన్యం బోర్డు కూడా సూచించింది. శ్రీశైలం జలాశయంపై ఆధారపడి, వరద జలాల ఆధారంగా నిర్మించిన మెజార్టీ ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించినవే. ఈ ప్రాజెక్టులకు నీరందాలంటే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం 874 అడుగులకు చేరాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ వరద నీటి మట్టం ను పట్టించుకోకుండా ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. రోజుకు సుమారు 3 టీఎంసీ లు విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తూ దిగువకు విడుదల చేయడంపై రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఈనెల 13న వరద నీటి చేరిక ప్రారంభమైంది. అప్పటికి శ్రీశైలం ప్రాజెక్టులో 44.7394 టీఎంసీ ల నీటి నిలువ ఉంది. 15వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం ను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి దిగువకు విడుదల చేయడాన్ని ఏపీ ప్రభుత్వం కూడా తప్పు పడుతోంది. జలవనరుల శాఖ అధికారులు కృష్ణ నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టం నిబంధనను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభ్హత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడాన్ని రాయలసీమ సాగునీటి సమితి వ్యతిరేకిస్తుంది. ఇది రాయలసీమకు శాపమని ఆందోళన వ్యక్తం.చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం లో అనుమతించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. వెనుకబడిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలంటే కృష్ణా జలాల నిర్వహణ సమగ్రంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Aam Aadmi Party: మధ్యప్రదేశ్లోనూ అడుగుపెట్టిన ఆప్.. మేయర్ పీఠం కైవసం
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?