Ap New DGP: బాధ్యతలు తీసుకోనున్న రాజేంద్రనాథ్… మార్క్ చూపిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పాలనపై ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా పోలీస్ బాస్ ని మార్చారు. డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీకి నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు.
డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని హఠాత్తుగా ఎందుకు బదిలీచేశారనేది అంతా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకారం డీజీపీకి పదవీకాలం కనీసం రెండేళ్లు ఉండాలి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ని తొలగించి సవాంగ్ను నియమించారు. సవాంగ్ రెండేళ్ల కాలం పూర్తి చేశారు. రెండేళ్ల కాలం పూర్తిచేశాక డీజీపీని బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది.
దీనిని ఎవరూ కాదనరు. కానీ డీజీపీని బదిలీ చేసేందుకు ఒక ప్రక్రియ ప్రారంభించాలి.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
గౌతమ్ సవాంగ్-జగన్ మధ్య మంచి సంబంధాలే వున్నాయి. ఆయనను ముఖ్యమంత్రి ‘అన్నా’ అని ఎంతో చనువుగా పిలిచేవారని చెబుతారు. అంతేకాదు, ఆయనకు ముఖ్యమంత్రి దగ్గర ఎంత చనువుందంటే, నేరుగా తలుపు తీసుకుని ముఖ్యమంత్రి ఆఫీస్లోకి వెళ్లే అంత చనువు వుందంటారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. రాజకీయనేతలతో ఎంతో సన్నిహితంగా మెలిగే ఉన్నతాధికారులు ఎక్కువ కాలం అలా సాగలేరని స్వయాన పాలనాధికారులే చెబుతున్నారు. జగన్-సవాంగ్ పనితీరుపై విమర్శలు చేశాయి విపక్షాలు. ఆయనెప్పుడూ డీజీపీగా పనిచేయలేదని టీడీపీ నేతలు బాహాటంగా విమర్శించారు.
ఎంతో విధేయతతో పనిచేసే సవాంగ్ బదిలీ వెనుక జగన్ వ్యూహమే వుందంటున్నారు. గతంలో తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కూడా పత్రికలు రాస్తున్నాయి. వచ్చే ఏడాది మధ్యలోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుందంటున్నారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ 2018లోనే ముందస్తుకి వెళ్లి మరోసారి సీఎం పీఠం అధిరోహించారు. అదే తరహాలో జగన్ వెళతారని అంటున్నారు. ఎన్నికలకు అందరినీ సమాయత్తం చేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, కొత్త డీజీపీని తీసుకురావడం అందులో భాగం అంటున్నారు.
ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా వున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి(1992 బ్యాచ్)ని డీజీపీగా తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయం అయింది. దానికి తోడు ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తి. డిపార్ట్మెంట్ మీద ఆయనకు గ్రిప్ రావాలంటే ఇప్పుడే నియామకం జరగాలని జగన్ వ్యూహం. అందుకే గౌతమ్ సవాంగ్ ని పంపేశారు. దీనికి తోడు ఛలో విజయవాడ సందర్భంగా డీజీపీ వ్యవహరించిన తీరుపై కూడా జగన్ అసహనంతో వున్నారు. అందుకే ఆయన్ని హఠాత్తుగా బదిలీ చేశారని అంటున్నారు. కొత్త బాధ్యతల్లో రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా ఒదిగిపోతారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!