Ap New DGP: బాధ్యతలు తీసుకోనున్న రాజేంద్రనాథ్… మార్క్ చూపిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పాలనపై ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా పోలీస్ బాస్ ని మార్చారు. డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీకి నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు.
డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని హఠాత్తుగా ఎందుకు బదిలీచేశారనేది అంతా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకారం డీజీపీకి పదవీకాలం కనీసం రెండేళ్లు ఉండాలి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ని తొలగించి సవాంగ్ను నియమించారు. సవాంగ్ రెండేళ్ల కాలం పూర్తి చేశారు. రెండేళ్ల కాలం పూర్తిచేశాక డీజీపీని బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది.
దీనిని ఎవరూ కాదనరు. కానీ డీజీపీని బదిలీ చేసేందుకు ఒక ప్రక్రియ ప్రారంభించాలి.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
గౌతమ్ సవాంగ్-జగన్ మధ్య మంచి సంబంధాలే వున్నాయి. ఆయనను ముఖ్యమంత్రి ‘అన్నా’ అని ఎంతో చనువుగా పిలిచేవారని చెబుతారు. అంతేకాదు, ఆయనకు ముఖ్యమంత్రి దగ్గర ఎంత చనువుందంటే, నేరుగా తలుపు తీసుకుని ముఖ్యమంత్రి ఆఫీస్లోకి వెళ్లే అంత చనువు వుందంటారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. రాజకీయనేతలతో ఎంతో సన్నిహితంగా మెలిగే ఉన్నతాధికారులు ఎక్కువ కాలం అలా సాగలేరని స్వయాన పాలనాధికారులే చెబుతున్నారు. జగన్-సవాంగ్ పనితీరుపై విమర్శలు చేశాయి విపక్షాలు. ఆయనెప్పుడూ డీజీపీగా పనిచేయలేదని టీడీపీ నేతలు బాహాటంగా విమర్శించారు.
ఎంతో విధేయతతో పనిచేసే సవాంగ్ బదిలీ వెనుక జగన్ వ్యూహమే వుందంటున్నారు. గతంలో తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కూడా పత్రికలు రాస్తున్నాయి. వచ్చే ఏడాది మధ్యలోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుందంటున్నారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ 2018లోనే ముందస్తుకి వెళ్లి మరోసారి సీఎం పీఠం అధిరోహించారు. అదే తరహాలో జగన్ వెళతారని అంటున్నారు. ఎన్నికలకు అందరినీ సమాయత్తం చేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, కొత్త డీజీపీని తీసుకురావడం అందులో భాగం అంటున్నారు.
ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా వున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి(1992 బ్యాచ్)ని డీజీపీగా తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయం అయింది. దానికి తోడు ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తి. డిపార్ట్మెంట్ మీద ఆయనకు గ్రిప్ రావాలంటే ఇప్పుడే నియామకం జరగాలని జగన్ వ్యూహం. అందుకే గౌతమ్ సవాంగ్ ని పంపేశారు. దీనికి తోడు ఛలో విజయవాడ సందర్భంగా డీజీపీ వ్యవహరించిన తీరుపై కూడా జగన్ అసహనంతో వున్నారు. అందుకే ఆయన్ని హఠాత్తుగా బదిలీ చేశారని అంటున్నారు. కొత్త బాధ్యతల్లో రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా ఒదిగిపోతారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!