Ap New DGP: బాధ్యతలు తీసుకోనున్న రాజేంద్రనాథ్… మార్క్ చూపిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పాలనపై ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా పోలీస్ బాస్ ని మార్చారు. డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీకి నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు.
డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని హఠాత్తుగా ఎందుకు బదిలీచేశారనేది అంతా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకారం డీజీపీకి పదవీకాలం కనీసం రెండేళ్లు ఉండాలి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ని తొలగించి సవాంగ్ను నియమించారు. సవాంగ్ రెండేళ్ల కాలం పూర్తి చేశారు. రెండేళ్ల కాలం పూర్తిచేశాక డీజీపీని బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది.
దీనిని ఎవరూ కాదనరు. కానీ డీజీపీని బదిలీ చేసేందుకు ఒక ప్రక్రియ ప్రారంభించాలి.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
గౌతమ్ సవాంగ్-జగన్ మధ్య మంచి సంబంధాలే వున్నాయి. ఆయనను ముఖ్యమంత్రి ‘అన్నా’ అని ఎంతో చనువుగా పిలిచేవారని చెబుతారు. అంతేకాదు, ఆయనకు ముఖ్యమంత్రి దగ్గర ఎంత చనువుందంటే, నేరుగా తలుపు తీసుకుని ముఖ్యమంత్రి ఆఫీస్లోకి వెళ్లే అంత చనువు వుందంటారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. రాజకీయనేతలతో ఎంతో సన్నిహితంగా మెలిగే ఉన్నతాధికారులు ఎక్కువ కాలం అలా సాగలేరని స్వయాన పాలనాధికారులే చెబుతున్నారు. జగన్-సవాంగ్ పనితీరుపై విమర్శలు చేశాయి విపక్షాలు. ఆయనెప్పుడూ డీజీపీగా పనిచేయలేదని టీడీపీ నేతలు బాహాటంగా విమర్శించారు.
ఎంతో విధేయతతో పనిచేసే సవాంగ్ బదిలీ వెనుక జగన్ వ్యూహమే వుందంటున్నారు. గతంలో తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కూడా పత్రికలు రాస్తున్నాయి. వచ్చే ఏడాది మధ్యలోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుందంటున్నారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ 2018లోనే ముందస్తుకి వెళ్లి మరోసారి సీఎం పీఠం అధిరోహించారు. అదే తరహాలో జగన్ వెళతారని అంటున్నారు. ఎన్నికలకు అందరినీ సమాయత్తం చేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, కొత్త డీజీపీని తీసుకురావడం అందులో భాగం అంటున్నారు.
ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా వున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి(1992 బ్యాచ్)ని డీజీపీగా తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయం అయింది. దానికి తోడు ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తి. డిపార్ట్మెంట్ మీద ఆయనకు గ్రిప్ రావాలంటే ఇప్పుడే నియామకం జరగాలని జగన్ వ్యూహం. అందుకే గౌతమ్ సవాంగ్ ని పంపేశారు. దీనికి తోడు ఛలో విజయవాడ సందర్భంగా డీజీపీ వ్యవహరించిన తీరుపై కూడా జగన్ అసహనంతో వున్నారు. అందుకే ఆయన్ని హఠాత్తుగా బదిలీ చేశారని అంటున్నారు. కొత్త బాధ్యతల్లో రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా ఒదిగిపోతారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!