Jogi Ramesh: కుప్పం నుంచి స్టార్ట్.. 175 నియోజకవర్గాల్లో తిరుగుబాటే..!
టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి నిదర్శనం కుప్పం.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది.. ఆయన జెండాను, పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్… 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఏ వర్గానికి అయినా మేలు చేశాడా..? అని ప్రశ్నించిన ఆయన.. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాకు చంద్రబాబు ఏమీ చేశాడు అని ప్రజలు తిరుగుబాటు చేశారు.. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం అయింది.. మమ్మల్ని వాడుకుని వదిలేశాడని బీసీలు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలు, మహిళలు అందరూ తిరుగుబాటు చేశారన్నారు.. మూడేళ్లలో జగన్ మా గడపకి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వారు స్పష్టంగా చెప్తున్నారు.. మమ్మల్ని బానిసలుగా చేసుకున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని కుప్పం వస్తాడు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.. మూడు సార్లు కూడా కుప్పం రాని ఆయన ఇప్పుడు పర్యటనలనీ హడావుడి చేస్తున్నారని.. ఎన్ని అన్నా క్యాంటీన్ లు పెట్టావు… ఎంతమంది భోజనం చేశారు…? అని నిలదీస్తున్నారు.. ఒక కుప్పంలోనే కాదు 175 నియోజకవర్గాల్లో ఇదే తిరుగుబాటు ప్రారంభం అవుతుందని జోస్యం చెప్పారు జోగి రమేష్.
Read Also: Pawan Kalyan and KA Paul: కేఏ పాల్కి, పవన్ పాల్కి తేడా లేదు… ఇద్దరికీ సీట్లు లేవు..!
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
చంద్రబాబు ఈ రాష్ట్రంలో తిరగడానికి వీల్లేదని ముక్త కంఠంతో చెప్తున్నారన్నారు జోగి రమేష్.. మా ఓట్లు దండుకుని మాకు సున్నం పెట్టాడని అన్ని వర్గాలు తిరుగుబాటు చేస్తున్నారన్న ఆయన.. ప్రజల్ని ఓటు అడిగే హక్కు చంద్రబాబుకి, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు.. ప్రజలు కూడా పార్టీలు, కులాలు, మతాలు చూడం… జగన్ నీ మాత్రమే చూస్తామని చెప్తున్నారన్నారు.. నీ నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కు లేదు.. ఇక రాష్ట్రానికి ఏమీ చేస్తావ్ చంద్రబాబు…? అని నిలదీశారు.. అచ్చి, బుచ్చి, బొడి అందరకీ చెప్తున్నాం.. మీరు చంద్రబాబుని నమ్ముకుంటే కష్టమే.. తండ్రీ కొడుకులనీ నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు అని తెలుగుదేశం పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!