Ambati Rambabu: చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంపై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు 2018 లోపలే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారుగా.. అపారమైన జ్ఞానం ఉన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు.? అని ప్రశ్నించారు. నాకు మిడిమిడి జ్ఞానం ఉందని చంద్రబాబు మీడియా వార్తలు రాసింది అని ఫైర్ అయ్యారు.. దెబ్బతిన్న డయాఫ్రమ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వెల్లడించిన అంబటి.. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించింది.. వారు ఇచ్చే సూచనల కోసం ఎదురు చూస్తున్నాం.. కానీ, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి కారణం ఎవరు?? చంద్రబాబు ప్రణాళికా రహితంగా వెళ్ళటం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు.
Read Also: Kakani Govardhan Reddy: నల్లపురెడ్డితో మంత్రి కాకాణి భేటీ.. విషయం ఇదే..!
Also Read
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
గోదావరి నది నీటిని మళ్లించి, స్పిల్ వే ఛానల్ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి.. కానీ, చంద్రబాబు ఒకేసారి అన్ని పనులు చెయ్యటం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు అంబటి రాంబాబు.. ఈ విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని విమర్శించారు. ఇక, 35 కాంటూరు దగ్గర గ్రామాలకు పునరావాసం కల్పించాం.. అప్రోచ్ ఛానల్, స్పిల్ వే పూర్తి చేసి నదీ మార్గాన్ని మళ్ళించామని తెలిపారు.. రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేశామన్నారు. మరోవైపు, నాగార్జునసాగర్ విషయంలో తెలియక కొంత పొరపాటు పడిన మాట వాస్తవం.. ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలోనూ డయాఫ్రమ్ ఉంటుంది అనుకున్నా… తెలియనివి తెలుసుకుంటా అన్నారు. దేవినేని ఉమా గురించి అదో, ఇదో తెలియదు అంటున్నారు… వైద్యులకు చూపించుకోవటం మంచిదని సెటైర్లు వేశారు. డయాఫ్రమ్ వాల్ పడిన గుంతలు పూడ్చడానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది.. నీళ్లు తోడాలంటే 2వేల కోట్లు ఖర్చు అవుతుంది.. ఈ పాపం చంద్రబాబుది కాదా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ట్రెండింగ్
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!