Ambati Rambabu: చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంపై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు 2018 లోపలే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారుగా.. అపారమైన జ్ఞానం ఉన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు.? అని ప్రశ్నించారు. నాకు మిడిమిడి జ్ఞానం ఉందని చంద్రబాబు మీడియా వార్తలు రాసింది అని ఫైర్ అయ్యారు.. దెబ్బతిన్న డయాఫ్రమ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వెల్లడించిన అంబటి.. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించింది.. వారు ఇచ్చే సూచనల కోసం ఎదురు చూస్తున్నాం.. కానీ, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి కారణం ఎవరు?? చంద్రబాబు ప్రణాళికా రహితంగా వెళ్ళటం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు.
Read Also: Kakani Govardhan Reddy: నల్లపురెడ్డితో మంత్రి కాకాణి భేటీ.. విషయం ఇదే..!
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
గోదావరి నది నీటిని మళ్లించి, స్పిల్ వే ఛానల్ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి.. కానీ, చంద్రబాబు ఒకేసారి అన్ని పనులు చెయ్యటం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు అంబటి రాంబాబు.. ఈ విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని విమర్శించారు. ఇక, 35 కాంటూరు దగ్గర గ్రామాలకు పునరావాసం కల్పించాం.. అప్రోచ్ ఛానల్, స్పిల్ వే పూర్తి చేసి నదీ మార్గాన్ని మళ్ళించామని తెలిపారు.. రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేశామన్నారు. మరోవైపు, నాగార్జునసాగర్ విషయంలో తెలియక కొంత పొరపాటు పడిన మాట వాస్తవం.. ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలోనూ డయాఫ్రమ్ ఉంటుంది అనుకున్నా… తెలియనివి తెలుసుకుంటా అన్నారు. దేవినేని ఉమా గురించి అదో, ఇదో తెలియదు అంటున్నారు… వైద్యులకు చూపించుకోవటం మంచిదని సెటైర్లు వేశారు. డయాఫ్రమ్ వాల్ పడిన గుంతలు పూడ్చడానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది.. నీళ్లు తోడాలంటే 2వేల కోట్లు ఖర్చు అవుతుంది.. ఈ పాపం చంద్రబాబుది కాదా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!