Minister Suresh: ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దారుణం
ఇటీవల గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో రాజకీయంగా అగ్గి రాజుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరాలు చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తుండగా, వైసీపీ నేతలు అందుకు తగ్గ రీతిలోనే కౌంటర్స్ వేస్తున్నారు. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: TS Inter Exams: ఇంటర్ పరీక్షలు.. ఆ నిబంధన వర్తింపు
Also Read
రేపల్లె ఘటన బాధితురాలికి న్యాయం చేయాలని చూస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని బీహార్తో పోలుస్తూ ప్రతిపక్షాలు దారుణంగా కామెంట్స్ చేస్తున్నాయని చెప్పిన సురేశ్.. మహిళలపై దాడుల విషయంలో రాజకీయాలు చేయకూడదని సూచించారు. ప్రభుత్వపరంగా బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నిందితులపై ఎస్పీ, ఎస్టీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. బాధితురాలు యర్రదొండపాలెం ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో, ఆమెను ఒంగోలు రిమ్స్కు తరలించారని వెల్లడించారు. అందులో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
కాగా.. అవనిగడ్డలో పని చేసేందుకు రేపల్లే రైల్వే స్టేషన్కు చేరుకున్న దంపతలిద్దరు, అక్కడి నుంచి బస్సులు లేవని తెలిసి స్టేషన్లోనే పడుకున్నారు. ఇది గమనించిన ముగ్గురు వ్యక్తులు, నిద్రిస్తున్న మహిళని పక్కకు లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన భర్తని విచక్షణారహితంగా కొట్టారు. వారిని ఎదుర్కోలేకపోయిన భర్త, వెంటనే 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే, అక్కడికి చేరుకునేలోపు ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకున్న పోలీసులు, నిందితుల్ని పట్టుకున్నారు.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!