Mega DSC 2025: మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల..
- అమరావతి: 2025 మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల..
- రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ..
- తుది జాబితా విడుదలతో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియకు ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2025 మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేయగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు అధికారికంగా తుది జాబితాను రిలీజ్ చేశారు. అయితే, ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16, 347 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సరైన అర్హత కలిగిన అభ్యర్థులు రాకపోవడంతో, చివరికి 15,941 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ తుది జాబితా ప్రకారం ఎంపికైన వారిలో 49 శాతం మహిళలు ఉన్నారు.
Read Also: Shaheen Afridi: షాహిన్ అఫ్రిది దొరికాడో.. ఉరికించి ఉరికించి కొడతాం!
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ఇక, మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది.. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కేవలం 150 రోజుల్లోనే విద్యా శాఖ డీఎస్సీని పూర్తి చేసింది అన్నారు. అయితే, ఈసారి డీఎస్సీలో అవకాశం రాని వారు నిరాశ చెందవద్దు.. ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ నియామక ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి నుంచి మొత్తం 5,07,675 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి డీఎస్సీ పట్ల అభ్యర్థుల చాలా ఆసక్తిని చూపించారు.
Read Also: Trump: ఆ సమయం ముగిసింది.. డల్లాస్ భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన ప్రకటన
అయితే, ఫైనల్ లిస్ట్లో ఎంపికైన వారికి ఈ నెల 19వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం అభ్యర్థుల పోస్టింగ్ల కేటాయింపుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా, ఫైనల్ లిస్ట్ను డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. కొత్తగా హారిజాంటల్ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చినట్లు విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ చెప్పుకొచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే, సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను అభ్యర్థులు సంప్రదించవచ్చని తెలిపారు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!