Mega DSC 2025: మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల..
- అమరావతి: 2025 మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల..
- రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ..
- తుది జాబితా విడుదలతో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియకు ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2025 మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేయగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు అధికారికంగా తుది జాబితాను రిలీజ్ చేశారు. అయితే, ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16, 347 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సరైన అర్హత కలిగిన అభ్యర్థులు రాకపోవడంతో, చివరికి 15,941 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ తుది జాబితా ప్రకారం ఎంపికైన వారిలో 49 శాతం మహిళలు ఉన్నారు.
Read Also: Shaheen Afridi: షాహిన్ అఫ్రిది దొరికాడో.. ఉరికించి ఉరికించి కొడతాం!
Also Read
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
ఇక, మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది.. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కేవలం 150 రోజుల్లోనే విద్యా శాఖ డీఎస్సీని పూర్తి చేసింది అన్నారు. అయితే, ఈసారి డీఎస్సీలో అవకాశం రాని వారు నిరాశ చెందవద్దు.. ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ నియామక ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి నుంచి మొత్తం 5,07,675 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి డీఎస్సీ పట్ల అభ్యర్థుల చాలా ఆసక్తిని చూపించారు.
Read Also: Trump: ఆ సమయం ముగిసింది.. డల్లాస్ భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన ప్రకటన
అయితే, ఫైనల్ లిస్ట్లో ఎంపికైన వారికి ఈ నెల 19వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం అభ్యర్థుల పోస్టింగ్ల కేటాయింపుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా, ఫైనల్ లిస్ట్ను డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. కొత్తగా హారిజాంటల్ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చినట్లు విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ చెప్పుకొచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే, సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను అభ్యర్థులు సంప్రదించవచ్చని తెలిపారు.
తాజావార్తలు
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!