AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డి విడుదల.. ఆ ముగ్గురికి బెయిల్!
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం..
- ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్..
- రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి..
- ఈ నెల 11న సరెండర్ కావాలని మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు ఆదేశం..
- ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు మిథున్రెడ్డికి అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ31గా ధనుంజయ్ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33గా ఉన్న బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురి పాస్పోర్ట్లను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Bowel Cancer: షాకింగ్ అధ్యయనం.. మాంసం, మద్యం తాగే యువతకు పెద్దపేగు క్యాన్సర్..!
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
ఇక, లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సెట్ అధికారులు జూలై 20న అరెస్ట్ చేయగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదిగా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు మిథున్ రెడ్డి వేసిన రెగ్యులర్ బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కు న్యాయస్థానం అంగీకరించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఓటు వేసేందుకు అనుమతి దొరికింది. అలాగే, ఈనెల 11వ తేదీన తిరిగి కోర్టులో సరెండర్ కావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Viral: పాకిస్థాన్ లో ఘనంగా వినాయక నిమజ్జనం
కాగా, జైలు నుంచి విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పలువురు పార్టీ నేతలు, శ్రేణులు కలిసి పరామర్శించారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే తమ పార్టీ ఎంపీలు మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!