AP Inter Supply Results: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు విడుదల చేశారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్ట్ 3 నుంచి 12వ తేదీ వరకు జరిగాయి. జనరల్ ఇంటర్ తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఇక ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే వీరిలో.. 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ లో 35 శాతం.. ఒకేషనల్ లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ సెకండియర్ జనరల్ లో 33 శాతం.. ఒకేషనల్ లో 46 శాతం మంది పాస్ అయ్యారు. ఈపరీక్షా ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్ సైట్లలోకి లాగిన్ అయి చూసుకోవచ్చు.
ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు June 22న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4, 45, 604 మంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు 4 లక్షల 23 వేల 455 మంది. ఒకేషనల్ పరీక్షలు రాసిన విద్యార్థులు 72వేల 299 మంది. మొత్తంగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు 9,41,358 మంది. తొలిసారిగా సీసీ కెమేరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించింది ఇంటర్ బోర్డు.
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
ఇంటర్ ఫలితాలను విడుదలచేశామని, సీడీ పాస్ వర్డ్ అందుబాటులో వుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చిలో జరగాల్సిన పరీక్షలను మే నెలలో నిర్వహించామన్నారు. స్పాట్ వాల్యుయేషన్ వేగంగా పూర్తిచేశామన్నారు. ఈ పరీక్షల్లో రికార్డ్ స్థాయిల్లో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. మొదటి సంవత్సరం 54 శాతం, సెకండియర్ లో ఉత్తీర్ణత శాతం 61 శాతంగా వుందన్నారు. ఫస్టియర్ లో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం పాసయ్యారు. సెకండియర్ లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం పాసయ్యారు.
మొదటి సంవత్సరం 4,45,604 మంది పరీక్షలు రాయగా 2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి ఏడాది 54శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 4,23,458 పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైన వారు 2,58,449. ఇంటర్ ఫలితాల్లో దుమ్ము రేపారు బాలికలు. ఉమ్మడి జిల్లాల్లో టాప్ లో కృష్ణా జిల్లా వుంది. కృష్ణా జిల్లాలో 72 శాతం, చివరి ప్లేస్ లో కడప 50 శాతంగా పేర్కొన్నారు.
AP Inter Supply Results: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తాజావార్తలు
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!