Home Minister Anitha: వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకే పరిమితమైంది..
- వైఎస్ జగన్ ధర్నాపై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్..
- రాజకీయాలకు సంబందం లేని విషయాలపై ధర్నా చేస్తున్నారు..
- అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా కాదు: హోంమంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: ఢిల్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధర్నాపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు సిద్దాంతాలు ఉంటాయి.. కానీ వైసీపీకి అబద్ధపు, ప్రచారాలు నంగనాచి కబుర్లు చెప్పడమే సిద్దాంతం.. వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ అని ఆరోపించారు. రాష్ట్రంలో మొహం చెల్లడం లేదు.. ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వకుండా మిడిసి పడ్డారు.. రాజకీయాలకు సంబందం లేని వినుకొండ హత్యను రాజకీయం చేస్తున్నారు.. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తుగ్లక్ రెడ్డి ధర్నా చేపట్టారు అని విమర్శించారు. జగన్ నిద్రలో కూడా రెడ్ బుక్ ను తలచుకుంటున్నాడు.. జగన్ కు పెట్టుబడులు తీసుకు రావడం చేత కాలేదు అని హోంమంత్రి అనిత అన్నారు.
Read Also: Simbaa : జగపతిబాబు, అనసూయల ‘సింబా’ ట్రైలర్ టాక్..!
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
ఇక, పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టడానికి జగన్ కు మొహం చెల్లడం లేదు అని మంత్రి అనిత తెలిపారు. సీఎం చంద్రబాబు పెట్టుబడులు తెస్తుంటే అడ్డుకోవడానికి జగన్ ఢిల్లిలో ధర్నాలు చేస్తున్నాడు.. జగన్ ఢిల్లీలో పెట్టిన ఎగ్జిబిషన్ లో బాబాయ్ హత్య కేసు, తోటా చంద్రయ్య హత్య కేసుల ఫోటోలు కూడా పెట్టాలి అని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వంలో 36 రాజకీయ హత్యలు జరిగాయని పులివెందుల ఎమ్మెల్యే చెప్తున్నారు.. ఆధారాలతో సహా వస్తే చర్చకు సిద్ధం.. గతంలో జగన్ ఢిల్లి పర్యటనలు కేసుల మాఫీ కోసం జరిగేవి.. వినుకొండ హత్య కేసు రాజకీయం చేస్తున్నారని జగన్ సోదరి షర్మిల చెప్తుంది.. ఇండియా కూటమి నాయకులకు వాస్తవాలు తెలియక జగన్ ధర్నా దగ్గరకు వెళ్ళి ఉంటారు.. అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా కాదు.. ప్రజలు ఇవ్వాలి అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!