Home Minister Anitha: వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకే పరిమితమైంది..
- వైఎస్ జగన్ ధర్నాపై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్..
- రాజకీయాలకు సంబందం లేని విషయాలపై ధర్నా చేస్తున్నారు..
- అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా కాదు: హోంమంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: ఢిల్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధర్నాపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు సిద్దాంతాలు ఉంటాయి.. కానీ వైసీపీకి అబద్ధపు, ప్రచారాలు నంగనాచి కబుర్లు చెప్పడమే సిద్దాంతం.. వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ అని ఆరోపించారు. రాష్ట్రంలో మొహం చెల్లడం లేదు.. ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వకుండా మిడిసి పడ్డారు.. రాజకీయాలకు సంబందం లేని వినుకొండ హత్యను రాజకీయం చేస్తున్నారు.. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తుగ్లక్ రెడ్డి ధర్నా చేపట్టారు అని విమర్శించారు. జగన్ నిద్రలో కూడా రెడ్ బుక్ ను తలచుకుంటున్నాడు.. జగన్ కు పెట్టుబడులు తీసుకు రావడం చేత కాలేదు అని హోంమంత్రి అనిత అన్నారు.
Read Also: Simbaa : జగపతిబాబు, అనసూయల ‘సింబా’ ట్రైలర్ టాక్..!
Also Read
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ఇక, పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టడానికి జగన్ కు మొహం చెల్లడం లేదు అని మంత్రి అనిత తెలిపారు. సీఎం చంద్రబాబు పెట్టుబడులు తెస్తుంటే అడ్డుకోవడానికి జగన్ ఢిల్లిలో ధర్నాలు చేస్తున్నాడు.. జగన్ ఢిల్లీలో పెట్టిన ఎగ్జిబిషన్ లో బాబాయ్ హత్య కేసు, తోటా చంద్రయ్య హత్య కేసుల ఫోటోలు కూడా పెట్టాలి అని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వంలో 36 రాజకీయ హత్యలు జరిగాయని పులివెందుల ఎమ్మెల్యే చెప్తున్నారు.. ఆధారాలతో సహా వస్తే చర్చకు సిద్ధం.. గతంలో జగన్ ఢిల్లి పర్యటనలు కేసుల మాఫీ కోసం జరిగేవి.. వినుకొండ హత్య కేసు రాజకీయం చేస్తున్నారని జగన్ సోదరి షర్మిల చెప్తుంది.. ఇండియా కూటమి నాయకులకు వాస్తవాలు తెలియక జగన్ ధర్నా దగ్గరకు వెళ్ళి ఉంటారు.. అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా కాదు.. ప్రజలు ఇవ్వాలి అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
తాజావార్తలు
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!