AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బదిలీలకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt Gives Green Signal To Transfer Government Employees: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉద్యోగుల బదిలీపై నిషేధం ఉండగా.. ఇప్పుడు దాన్ని సడలించింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్వర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ.. మే 22 తేదీ నుంచి 31 తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే.. అందులో కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులును బదిలీలకు అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం.. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి మాత్రం రిక్వెస్ట్పై బదిలీకి అవకాశం కల్పిస్తున్నారు.
Varun Tej: లావణ్య తో వరుణ్ తేజ్ పెళ్లి.. అదేంటి నిహారిక అలా అనేసింది
Also Read
- AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
ఉద్యోగుల బదిలీల్లో ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసి, ఆ తర్వాత ఇతర ప్రాంతాలపై దృష్టి పెడతామని ప్రభుత్వం వెల్లడించింది. ఆదాయార్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజు, రవాణా, వ్యవసాయ శాఖలు కూడా నిబంధనలకు అనుగుణంగానే మే 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. పాఠశాల విద్య, ఇంటర్, సాంకేతిక ఉన్నత విద్యా శాఖలు ఈ బదిలీల ప్రక్రియకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బదిలీ ప్రక్రియలో ఏసీబీ కేసులు, విజిలెన్సు విచారణ పెండింగులో ఉన్న వారి అంశాలను తెలియచేయాలని ఆర్థిక శాక ఆయా శాఖల్ని ఆదేశించింది. జూన్ 1 తేదీ నుంచి మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Pakistan: “మీ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారు.. అప్పగించండి”.. ఇమ్రాన్ ఖాన్కు పోలీసుల అల్టిమేటం..
గతేడాది జూన్లో కూడా ఒకసారి ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఒకే చోట 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది. వ్యక్తిగత వినతులు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా కూడా.. అప్పుడు బదిలీల ప్రక్రియను నిర్వహించడం జరిగింది.
తాజావార్తలు
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..