Montha Effect : ఏపీని ముంచిన మొంథా.. ఎన్ని కోట్ల నష్టమంటే..?
- తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా
- మొంథా తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్లు నష్టం
- వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం
- ఆర్అండ్బీలో ఎక్కువ నష్టం జరిగింది. -సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Montha Effect : ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడిన మొంథా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో తుఫాన్ నష్టంపై ప్రాథమిక అంచనా నివేదికను అధికారులు సమర్పించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అందులో రోడ్లు, భవనాల శాఖకు రూ.2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం జరిగిందని ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువగా నమోదైందని అని తెలిపారు.
Also Read
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే పశుసంవర్థక రంగంలో కొంత నష్టం నమోదైనట్లు చెప్పారు. “20 పశువులు చనిపోయాయి, రూ.71 లక్షల మేర నష్టం జరిగింది” అని వివరించారు. హార్టికల్చర్, సిరికల్చర్, ఆక్వా రంగాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం, సిరికల్చర్ రంగంలో రూ.65 కోట్ల నష్టం సంభవించిందన్నారు. ఆక్వా రంగం అత్యధికంగా రూ.1,270 కోట్ల మేర నష్టపోయిందని వివరించారు.
మున్సిపల్ శాఖకు కూడా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని సీఎం తెలిపారు. “మున్సిపల్ మౌలిక వసతులకు రూ.109 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశాం,” అని చెప్పారు.అంతేకాకుండా.. “తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం. రైతులు, ప్రజలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం,” అని ఆయన తెలిపారు.
Chabahar Port: చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్కు అతిపెద్ద దౌత్య విజయం..
తాజావార్తలు
-
Most Valuable Celebrities list : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!