Chabahar Port: చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్కు అతిపెద్ద దౌత్య విజయం..
- భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం..
- చాబహార్ పోర్టు ఆంక్షల నుంచి భారత్కు మినహాయింపు..
- ఆరు నెలల పాటు మినహాయింపు ఇచ్చిన అమెరికా..
Chabahar Port: భారత్కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరాన్లోని చాబహార్ పోర్టుపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి 6 నెలల మినహాయింపు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మినహాయింపులు సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
Read Also: Bandi Sanjay Kumar: బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గం..
Also Read
- BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
- Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
- Tamil Nadu Election Results: విజయ్కి కాంగ్రెస్, వామపక్షాల మద్దతు..?
- Actor Vijay TVK: సినీ నుంచి రాజకీయాల వరకు దళపతి విజయ్ ప్రస్థానం.. సవాళ్లను అధిగమించి..
సెప్టెంబర్ 18న, ట్రంప్ ప్రభుత్వం ఇరాన్లోని ఈ పోర్టు కార్యకలాపాలపై 2018లో ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోర్టు నిర్మాణంలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. ఇది భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించింది. ఇరాన్పై ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజాగా అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపు భారత్, చాబహార్ పోర్టులో యూఎస్ జరిమానాలు ఎదుర్కోకుండా పని కొనసాగించడానికి అనుమతిస్తుంది. పాకిస్తాన్ను బైపాస్ చేసి మధ్య ఆసియాతో వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చాబహార్ పోర్టు భారత్కు చాలా ముఖ్యం. దీంతో పాటు పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకు చెక్ పెట్టేందుకు చాబహార్ పోర్టు భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యత అందిస్తుంది.
భారత్కు చాబహార్ చాలా కీలకం:
2018లో చాబహార్ పోర్టును భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ నుంచి కాకుండా ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లేందుకు, అక్కడి నుంచి సెంట్రల్ ఆసియా చేరేందుకు ఈ పోర్టు కీలకం. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి కౌంటర్గా చాబహార్ ఉపయోగపడుతుంది. అయితే, 2021లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో చాబహార్ ప్రాముఖ్యత తగ్గింది. అయితే, ఇప్పుడున్న జియోపాలిటిక్స్లో భారత్-ఆఫ్ఘనిస్తాన్ బంధం మరింత బలపడింది. పాకిస్తాన్-ఆఫ్ఘాన్ లకు అసలు పడటం లేదు. దీంతో చాబహార్ పోర్టు మరోసారి తన ప్రాధాన్యతలోకి వచ్చింది.
చాబహార్ పోర్టు ఇరాన్ దక్షిణ తీరంలోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. భారతదేశం ఈ ఓడరేవులో షాహిద్ బెహెష్టి టెర్మినల్ను నిర్వహిస్తోంది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా చాబహార్ పోర్టును ఎంతో విలువైనదిగా భావిస్తుంది. ఎందుకంటే ఇది పాకిస్తాన్ను దాటవేసి అరేబియా సముద్రం ద్వారా భారత్ను ఆఫ్ఘనిస్తాన్ను కలుపుతుంది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా జూనియర్ ఎన్టీఆర్
-
Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
-
BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
-
Vishwambhara: బర్త్ డే సర్ప్రైజ్.. విశ్వంభరలో త్రిష పాత్ర పేరు రివీల్ చేసిన చిత్ర యూనిట్!
-
Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!