GIS 2023: రెండో రోజు ఏపీ ప్రభుత్వం కీలక ఎంవోయూలు.. ఏయే కంపెనీలు ఎంత పెట్టుబడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Key MOUs With Companies In GIS Day 2: విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో భాగంగా రెండో రోజు కొన్ని కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MOU) కుదుర్చుకున్నాయి. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగ్గా.. వీటిలో రిలయన్స్ కంపెనీ రూ.50వేల కోట్లలో అగ్రగామిగా నిలిచింది. ఒకసారి పూర్తి ఎంఓయూల జాబితాని పరిశీలిస్తే..
Revanth Reddy: రేవంత్రెడ్డి కాన్వాయ్కు భారీ యాక్సిడెంట్.. తప్పిన ప్రమాదం
Also Read
రిలయన్స్ రూ. 50,000 కోట్లు.. హెచ్పీసీఎల్ ఎనర్జీ రూ. 14,320 కోట్లు.. టీవీఎస్ ఐఎల్పీ రూ. 1,500 కోట్లు.. ఎకో స్టీల్ రూ. 894 కోట్లు.. బ్లూస్టార్ రూ. 890 కోట్లు.. ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ రూ. 850 కోట్లు.. గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్, ఎక్స్ప్రెస్ వెల్ రీసోర్సెస్ చెరో రూ. 800 కోట్లు.. రామ్కో రూ. 750 కోట్లు.. క్రిబ్కో గ్రీన్ రూ. 725 కోట్లు.. ప్రకాశ్ ఫెరోస్ రూ. 723 కోట్లు.. ప్రతిష్ట బిజినెస్, తాజ్ గ్రూప్, కింబర్లీ క్లార్క్ రూ. 700 కోట్లు చొప్పున ఎంఓయూలు.. అలియన్న్ టైర్ గ్రూప్ రూ. 679 కోట్లు.. దాల్మియా, అనా వొలియో వరుసగా రూ. 650 కోట్లు.. డీఎక్స్ఎన్ రూ. 600 కోట్లు.. ఈ-ప్యాక్ డ్యూరబుల్ రూ. 550 కోట్లు.. నాట్ సొల్యూషన్న్ రూ. 500 కోట్లు.. అకౌంటిఫై ఇంక్ రూ. 488 కోట్లు.. కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్, నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెరో రూ. 400 కోట్లు.. ఆటమ్స్టేట్ టెక్నాలజీస్, క్లేరియన్ సర్వీసెస్, చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ చెరో రూ. 350 కోట్ల ఎంఓయూలు జరిగాయి.
Marriage Cancelled: వధువు చేసిన చిన్న తప్పు.. పెళ్లి రద్దు చేసిన వరుడు
అంతేకాదు.. వీఆర్ఎమ్ గ్రూప్ రూ. 342 కోట్లు.. రివర్ బే గ్రూప్, హావెల్స్ ఇండియా, సూట్స్ కేర్ ఇండియా, పోలో టవర్స్, ఇండియా అసిస్ట్ ఇన్సైట్స్, స్పార్క్, టెక్ విషెన్ సాఫ్ట్వేర్, మిస్టిక్ పామ్స్, నియోలింక్ గ్రూప్ వరుసగా రూ. 300 కోట్లు చొప్పున ఎంఓయూలు.. ఎండానా ఎనర్జీస్ రూ. 285 కోట్లు.. అబ్సింకా హోటల్స్ రూ. 260 కోట్లు.. సర్ రే విలేజ్ రిసార్ట్స్, హ్యాపీ వండర్లాండ్ రిసార్ట్స్, చాంపియన్స్ యాచ్ క్లబ్, టెక్నోజెన్, పార్లె ఆగ్రో చెరో రూ. 250 కోట్లు.. ఎకో అజైల్ రిసార్ట్ రూ. 243 కోట్లు.. ఎల్జీ పాలిమర్స్ రూ. 240 కోట్లు.. హైథియన్ హ్యూయన్ మిషనరీ, గోకుల్ ఆగ్రో చెరో రూ. 230 కోట్లు.. ఎస్పీఎస్ ఇన్ఫ్రా రూ. 225 కోట్లు.. డీవీవీ బయో ఫ్యూయల్స్ రూ. 223 కోట్లు.. దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్, ఆమ్ కన్స్ట్రక్షన్స్ చెరో రూ. 200 కోట్లు.. కేపిటల్ బిజినెస్ పార్క్ రూ. 184 కోట్లు.. చాంయిన్ యాచ్ రూ. 190 కోట్లు.. ఎన్జీసీ ట్రాన్స్మిషన్ రూ. 185 కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి.
Minister Roja: జగన్ అంటే ఒక బ్రాండ్.. జగన్ అంటే జోష్
ఇంకా.. యాక్సలెంట్ ఫార్మా సైన్స్ రూ. 176 కోట్లు.. విన్విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ రూ. 174 కోట్లు.. ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్మెంట్ రూ. 165 కోట్లు.. చాంపియన్ ఇన్ఫ్రాటెక్, స్విచ్గేర్, ఆంబర్ ఎంటర్ప్రైజస్ ఇండియా, ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లుగా ఉన్నాయి. ఇలా మొదటి, రెండు రోజుల కీలక ఒప్పందాల ద్వారా.. ఆంధ్ర రాష్ట్రానికి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. మొత్తంగా 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఈ ఎంవోయూల ద్వారా ఏపీలోని 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..