చంద్రబాబు అందుకే అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా అంటించుకోవటం, అధికార పక్షంతో తిట్టించుకోవటం ఎందుకని అసెంబ్లీ బహిష్కరిస్తున్నాం అని టీడీపీ ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక్కో బహిరంగ సభకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి జనాలను రప్పించే ప్రయత్నం చేశారు అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ సభల ద్వారా కరోనా అంటించి పక్క రాష్ట్రం వెళ్లి పోయారు. పక్క రాష్ట్రంలో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. ప్రజల గురించి మాట్లాడే చిత్తశుద్ధి లేదు. తమ బండారం బయట పడుతుందనే అసెంబ్లీకి రాకుండా టీడీపీ పారిపోతోంది. తండ్రి, కొడుకులు 300 కోట్లు విలాసవంతమైన ఇంట్లో కూర్చుని జూమ్ లో మాట్లాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఎందుకు అంత భయపడుతున్నారు… ఒక్క కోవిడ్ కేర్ సెంటర్ కు అయినా వెళ్ళే ధైర్యం ఉందా.. కరోనా సంక్షోభంలో ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు అని ప్రశ్నించారు.
ప్రభుత్వం చేస్తున్న కృషి చంద్రబాబు కంటికి కనిపించదు. మీసాలు మెలేయటం, కాళ్ళు చూపించటం చేసిన రఘురామ కృష్ణంరాజు బాడీ ల్యాంగ్వేజ్ ఆశ్చర్యం కలిగించింది. చంద్రబాబు కేసీఆర్ పై 12 కేసులు పెట్టారు. చంద్రబాబు దేశ ద్రోహం అనే మాటే వినలేదంటున్నారు. అప్పుటి వైసీపీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పై కూడా దేశ ద్రోహం కేసు పెట్టారు… అదే కేసుతో బెదిరించి పార్టీ మారాలని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం పై కుట్ర పన్నిన రఘురామ కృష్ణంరాజు వెనుక ఉన్న తన పాత్ర బయట పడుతుందనే చంద్రబాబు ఆందోళన. అందుకే అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. మార్చి నెలలో ఎన్నికల కోసం పట్టుబట్టారు. అందుకే అప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు బడ్జెట్ సమావేశం పడతామంటే మార్చిలో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు శ్రీకాంత్ రెడ్డి.
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు