Buggana Rajendranath Reddy: ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే టార్గెట్.. 20,000 కొత్త ఎంఎస్ఎంఈలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buggana Rajendranath Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.. పారిశ్రామిక రంగంలో విశేషమైన వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో వైజాగ్ వేదికగా మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇక, ఈ సమ్మిట్కు విస్తృత ప్రచారం కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం.. ఈ సమ్మిట్లో, రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల బలమైన ఉనికిని, కల్పించనున్న మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రదర్శిస్తుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చెన్నై, బెంగళూరు, ముంబైలలో అనేక రోడ్షోలను నిర్వహించింది ఏపీ సర్కార్.. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, హెల్త్కేర్, మెడికల్ ఎక్విప్మెంట్, లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, పెట్రోలియం, ఫార్మా, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, టూరిజం, హాస్పిటాలిటీ వంటి దీర్ఘకాలిక వృద్ధికి అవకాశం ఉన్న వివిధ రంగాలను గుర్తించింది ఏపీ ప్రభుత్వం..
Read Also: TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్.. రేపే ఆ టికెట్లు విడుదల
Also Read
దీనిపై ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పనకు వెన్నెదన్నుగా నిలుస్తుండటంతో పూర్తి స్థాయిలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇస్తున్నామని నిర్ధారించారు. గత నాలుగు సంవత్సరాలలో వివిధ పథకాల క్రింద 3000 కోట్లకు పైగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఎంఎస్ఎంఈలకు విడుదల చేయబడ్డాయి. తద్వారా ఇప్పటికే ఉన్న ఎంఎస్ఎంఈల పురోగతితో పాటు 20,000 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లను సృష్టించడం, ఎంఎస్ఎంఈలలో ఐదు లక్షల కంటే ఎక్కువ కొత్త ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు.. రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి, ఉద్యోగ కల్పనలో పెరుగుదల నమోదుకాగా ప్రతి ఒక్కరికీ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. మూడేళ్లలో, 37,956 ఎంఎస్ఎంఈ యూనిట్లు 60,800 యూనిట్లకు పెరిగాయి, 2019లో 4,04,939 నుండి 5,61,235 మంది పనిచేస్తున్నారని వివరించారు.
Read Also: SBI Alert: పాన్ నంబర్ లింక్ చేయకపోతే అకౌంట్ బ్లాక్..! క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ
గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నిలకడగా మొదటి స్థానంలో ఉందని, ఈ సర్వే పర్సెప్షన్ సర్వే ఆధారంగా చేయడం గమనార్హం అన్నారు మంత్రి బుగ్గన.. ఇప్పటివరకు విడుదల చేసిన లెక్కల ప్రకారం, 2021-22లో దేశంలో అత్యధికంగా రెండంకెల జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతంగా ఉంది. 974 కి.మీతో దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం ఏపీ సొంతం. ప్రస్తుతం ఉన్న 6 ఓడరేవులతో పాటు కొత్తగా రాబోయే నాలుగు ఓడరేవులతో ఆగ్నేయ దిశలో భారతదేశ ముఖ ద్వారం అయినందున రాష్ట్రం సముద్ర మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇది అనుకూలమైన వ్యాపార వాతావరణంతో పాటు పరిశ్రమ-కేంద్రీకృత విధానాలను కలిగి ఉందని వెల్లడించారు.. దేశంలోని 11 పారిశ్రామిక కారిడార్లలో మూడింటిని ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నారు. కొన్నింటిని పేర్కొనడానికి, రాష్ట్రం లాజిస్టిక్స్ 2022 కోసం లీడ్స్ అవార్డు, ఎనర్జీ 2022 కోసం ఇనర్షియా అవార్డ్, పోర్ట్ లీడ్ కోసం ఈటీ అవార్డుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ 2022 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుందని గుర్తుచేశారు.. గత నాలుగు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, రాబోయే పెట్టుబడిదారులకు వేగవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్లు, సుదీర్ఘ తీరప్రాంతాలు, వివిధ రకాల ఓడరేవులు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సమృద్ధిగా ఉన్న భూములు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం హామీ ఇస్తుందని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?