Andhra Pradesh: సీఎస్తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ.. యథావిథిగా ఉద్యమం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగుల సంఘాల సమావేశం ముగిసింది.. అయితే, ఈ సారి కూడా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.. దీంతో, యథావిథిగా తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎస్తో సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్ కార్డ్లు, 11వ వేతన సంఘం అంశాలపై చర్చించాం.. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలని అడిగాం.. వీటిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.. కానీ, పే స్కేల్ విషయంలో స్పష్టత రాలేదన్నారు.. వైద్యారోగ్య శాఖ రేషనలైజేషన్ లో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం.. గత సమావేశంలో ఇతర సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు చేసినట్టు చెప్పారు.. ఏపీ జీఎల్ఐ గత ఆరు నెలలుగా క్రెడిట్ కాలేదని చెప్పామని తెలిపారు సూర్య నారాయణ.
Read Also: Manoj Sinha: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదు.. జమ్మూకశ్మీర్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
ఇక, హెల్త్ కార్డ్కు ఉద్యోగి వాటా చెల్లించినా ఉపయోగం లేదన్నారు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్.. 104 టోల్ ఫ్రీ నంబర్ అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు.. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలని అడిగినట్టు తెలిపారు.. మరోవైపు ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చీఫ్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులతో చర్చ జరిగింది.. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులలో అనేక ఇబ్బందులు ఉన్నాయని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.. పీఆర్సీ అరియర్స్ ఇంకా లెక్క కట్టలేదు అని చెప్పారు. పీఆర్సీ కమిషన్ రికమెండ్ చేసిన పే స్కేల్స్ ఇవ్వలేదు. కరెస్పాండెన్స్ పే స్కేల్స్ ఇస్తున్నారు.. పలు అంశాలపై అవగాహనకు మాత్రమే ఈ మీటింగ్ పెట్టారని.. డీఏ అరియర్స్, పీఆర్సి అరియార్స్ ను వేరుగా చూడాలి.. మా ఉద్యమం యథావిథిగా కొనసాగుతుంది.. వచ్చే నెల 5వ తేదీన మరో సారి సమావేశం అయ్యి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు .
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!