CM Chandrababu : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EHS బిల్లుల చెల్లింపు ఇక ఆన్లైన్లో
- ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులో ఆన్లైన్ విధానం అమలు
- మధ్యవర్తుల పాత్రకు ముగింపు.. వేగవంతమైన చెల్లింపులు
- ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్లెస్ చికిత్స సౌకర్యం
- ఆధునిక సాఫ్ట్వేర్తో పారదర్శకత పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) నిర్వహణలో సమూల మార్పులు శ్రీకారం చుట్టారు. గత కొంతకాలంగా ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఇకపై అన్ని రకాల లావాదేవీలను పూర్తిస్థాయిలో ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది.
War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్..
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
ఈ నూతన విధానం ద్వారా ఆసుపత్రులు అందించే చికిత్స బిల్లులు నేరుగా ఆన్లైన్ ద్వారానే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయానికి చేరుతాయి, తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఈహెచ్ఎస్ విధానాన్ని ప్రభుత్వం సమగ్రంగా పునఃసమీక్షించి, ఉద్యోగులు , పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరింత సరళీకృతమైన సాఫ్ట్వేర్ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పాత పద్ధతిలో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్ది, ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా ఆసుపత్రులకు సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని, తద్వారా ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) నిరంతరాయంగా అందాలని ఆయన స్పష్టం చేశారు.
Minister Seethakka : మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.!
ఈ క్రమంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా రంగంలోకి దిగి, ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారికి ప్రయోజనం చేకూర్చేలా ఈ కొత్త విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!