CM Chandrababu : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EHS బిల్లుల చెల్లింపు ఇక ఆన్లైన్లో
- ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులో ఆన్లైన్ విధానం అమలు
- మధ్యవర్తుల పాత్రకు ముగింపు.. వేగవంతమైన చెల్లింపులు
- ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్లెస్ చికిత్స సౌకర్యం
- ఆధునిక సాఫ్ట్వేర్తో పారదర్శకత పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) నిర్వహణలో సమూల మార్పులు శ్రీకారం చుట్టారు. గత కొంతకాలంగా ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఇకపై అన్ని రకాల లావాదేవీలను పూర్తిస్థాయిలో ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది.
War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్..
Also Read
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ నూతన విధానం ద్వారా ఆసుపత్రులు అందించే చికిత్స బిల్లులు నేరుగా ఆన్లైన్ ద్వారానే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయానికి చేరుతాయి, తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఈహెచ్ఎస్ విధానాన్ని ప్రభుత్వం సమగ్రంగా పునఃసమీక్షించి, ఉద్యోగులు , పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరింత సరళీకృతమైన సాఫ్ట్వేర్ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పాత పద్ధతిలో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్ది, ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా ఆసుపత్రులకు సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని, తద్వారా ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) నిరంతరాయంగా అందాలని ఆయన స్పష్టం చేశారు.
Minister Seethakka : మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.!
ఈ క్రమంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా రంగంలోకి దిగి, ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారికి ప్రయోజనం చేకూర్చేలా ఈ కొత్త విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!