War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్..
- సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్..
- ఇరాన్పై దాడులకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటన..
- చర్చలు సఫలం అయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, ఇరాన్ మధ్య గత మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. గత రెండు రోజులుగా అమెరికా , ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ గొడవలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
చర్చలు జరుగుతున్న తీరును బట్టి.. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, చమురు నిల్వ కేంద్రాల వంటి కీలక ప్రాంతాలపై దాడులు చేయవద్దని ట్రంప్ తన రక్షణ శాఖను ఆదేశించారు. ప్రస్తుతానికి ఐదు రోజుల పాటు ఈ దాడులను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. ఈ ఐదు రోజుల్లో జరిగే చర్చల ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
Also Read:Harish Rao : కాంగ్రెస్ సర్కార్ది ఎగవేతల పాలన.. రైతులకు అడుగడుగునా దగా
గత మూడు వారాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు కేంద్రాలపై అమెరికా గురిపెట్టడంతో అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న భయాలు నెలకొన్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమై యుద్ధం ఆగిపోతే.. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిస్తుంది. ముఖ్యంగా చమురు సరఫరా పునరుద్ధరించబడి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐదు రోజులు మాత్రమే దాడులు ఆపారు. ఈ లోపు రెండు దేశాలు ఒక ఒప్పందానికి వస్తాయా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చర్చలు విఫలమైతే మళ్ళీ దాడులు మొదలయ్యే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!