CM YS Jagan: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్ సమీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM YS Jagan Review On Sports And Youth Services Department: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో-ఖో వంటి ఆటల్ని ప్రధానంగా ఆడించనున్నారు. ఈ పోటీల్లో అబ్బాయిలే కాదు, అమ్మాయిలూ పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రీడలతో పాటు 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, ఇతర సంప్రదాయ ఆటల పోటీలను ప్రభుత్వం నిర్వహించనుంది. సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. మొత్తం 46 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు జరపనున్నారు.
Fire Accident: కోచింగ్ సెంటర్లో భారీగా చెలరేగిన మంటలు.. విద్యార్థులకు గాయాలు
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆటల పోటీలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. క్రికెట్లాంటి ఆటలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు మార్గదర్శకం చేస్తుందని.. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం సీఎస్కే జట్టుకి మూడు క్రికెట్ మైదానాల్లో శిక్షణ కార్యక్రమాలను అప్పగిస్తామన్నారు. భవిష్యత్తులో ఏపీ కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకు సాగాలని, దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుందని సూచించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులని.. ఆ ఇద్దరి సేవల్ని మనం వినియోగించుకోవాలని చెప్పారు. మొదట జిల్లా స్థాయిలో, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలన్నారు.
Pawan Kalyan: వారి తిట్లకు చేతలతో సమాధానం చెప్తా.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. హైస్కూల్, ఆ పై స్థాయిలో తప్పనిసరిగా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!