Permanent Land Rights: భూముల సమగ్ర రీసర్వే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారులుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. రీ – సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని స్పష్టం చేసిన సీఎం.. వందేళ్ల తర్వాత మరలా సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే.. రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలి.. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలని స్పష్టం చేశరాఉ.. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతమంది సర్వేయర్లు, సర్వే సిబ్బంది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. తొలివిడతలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాలు అందించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని.. జనవరి నాటికి ఈ కార్యక్రమం పూర్తి కావాలన్నారు సీఎం..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
అయితే, తొలివిడత సర్వే పూర్తయిన 2వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యటేషన్లు, 92వేలు ఫస్ట్ టైం ఎంట్రీస్ జరగ్గా, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని.. 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి చేసినట్లు, 19వేల భూవివాదాలను పరిష్కారమయ్యాయని సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు. ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేరకు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించిన అధికారులు. 2023, పిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేస్తామని తెలిపారు.. అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని వెల్లడించారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలన్న సీఎం.. 22– ఏ సమస్య పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలని సూచించారు.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి జరిగిన మేలును తెలియజేసేలా.. లబ్ధి పొందిన ప్రతి వారికి వ్యక్తిగతంగా లేఖ రాయాలని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్.. హక్కు పత్రాలు పొందిన వారందరికీ లేఖలు రాయాలన్న సీఎం. సమగ్ర భూసర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. భూగర్భ గనులుశాఖ అధికారులు సర్వే రాళ్ల ఉత్పత్తి పెరిగేలా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!