CM YS Jagan: కోవిడ్పై ఏపీ అప్రమత్తం.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉండాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్లు కేంద్రంగా చికిత్స అందాలి, టెస్టింగ్, మెడికేషన్ విలేజ్ క్లినిక్ కేంద్రంగా జరగాలి, ఏఎన్ఏం, ఆశావర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్ల కేంద్రంగా అందుబాటులో ఉండాలి.. పీహీచ్సీల పర్యవేక్షణలో విలేజ్ క్లినిక్లు పని చేయాలి అని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. కోవిడ్ వ్యాప్తి, తాజా పరిణామాలపై వివరించారు అధికారులు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్ల పని తీరు వంటి వాటి పై ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.. వైద్య, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీ పై సీఎం జగన్ కు నివేదిక సమర్పించారు.. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సమీక్ష జరిగింది.. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ న్యూ వేరియెంట్ బీఎప్– 7 ఎక్కడా నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మాస్క్ ధరించడంతో పాటు కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కలిగించాలని ఆదేశించారు.
Read Also: Fire Accident: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదం.. నలుగురు మృతి
Also Read
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
అనుమానాస్పదంగా ఉన్న కేసుల్లో తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలన్నారు సీఎం జగన్.. ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్న ఆయన.. కోవిడ్ పరంగా వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను ముందుగా తనిఖీ చేయాలన్నారు.. జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాల పైనా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలి.. లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్ క్లినిక్స్కు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రిఫర్ చేసేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే, రోజుకు 60వేల ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కెపాసిటీ గతంలో ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు. ప్రస్తుతం రోజుకు 30 వేల టెస్టింగ్ సామర్ధ్యముందని.. విజయవాడలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉందని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల టెస్టింగ్ ల్యాబులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని సీఎం వైఎస్ జగన్కు తెలిపారు అధికారులు.. మరో 19 చోట్ల టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పని సరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.. 320 టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉందని తెలిపిన అధికారులు. ఎన్ – 95 మాస్కులు, కోవిడ్ పీపీఈ కిట్స్ అందుబాటులో ఉంచుతామన్న సీఎం వైఎస్ జగన్కు వివరించారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!