CM YS Jagan: కోవిడ్పై ఏపీ అప్రమత్తం.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉండాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్లు కేంద్రంగా చికిత్స అందాలి, టెస్టింగ్, మెడికేషన్ విలేజ్ క్లినిక్ కేంద్రంగా జరగాలి, ఏఎన్ఏం, ఆశావర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్ల కేంద్రంగా అందుబాటులో ఉండాలి.. పీహీచ్సీల పర్యవేక్షణలో విలేజ్ క్లినిక్లు పని చేయాలి అని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. కోవిడ్ వ్యాప్తి, తాజా పరిణామాలపై వివరించారు అధికారులు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్ల పని తీరు వంటి వాటి పై ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.. వైద్య, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీ పై సీఎం జగన్ కు నివేదిక సమర్పించారు.. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సమీక్ష జరిగింది.. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ న్యూ వేరియెంట్ బీఎప్– 7 ఎక్కడా నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మాస్క్ ధరించడంతో పాటు కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కలిగించాలని ఆదేశించారు.
Read Also: Fire Accident: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదం.. నలుగురు మృతి
Also Read
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
అనుమానాస్పదంగా ఉన్న కేసుల్లో తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలన్నారు సీఎం జగన్.. ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్న ఆయన.. కోవిడ్ పరంగా వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను ముందుగా తనిఖీ చేయాలన్నారు.. జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాల పైనా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలి.. లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్ క్లినిక్స్కు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రిఫర్ చేసేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే, రోజుకు 60వేల ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కెపాసిటీ గతంలో ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు. ప్రస్తుతం రోజుకు 30 వేల టెస్టింగ్ సామర్ధ్యముందని.. విజయవాడలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉందని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల టెస్టింగ్ ల్యాబులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని సీఎం వైఎస్ జగన్కు తెలిపారు అధికారులు.. మరో 19 చోట్ల టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పని సరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.. 320 టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉందని తెలిపిన అధికారులు. ఎన్ – 95 మాస్కులు, కోవిడ్ పీపీఈ కిట్స్ అందుబాటులో ఉంచుతామన్న సీఎం వైఎస్ జగన్కు వివరించారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డిడి క్రేజ్ మాములుగా లేదుగా.! క్రికెటర్స్ మాత్రమే కాదు WWE స్టార్స్ కూడనా..
-
Manchu Manoj: అనాథలకు అండగా మంచు మనోజ్.. త్వరలో భారీ పునరావాస కేంద్రం!
-
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!