YSR Cheyutha: మహిళలకు గుడ్న్యూస్.. చంద్రబాబు అడ్డా నుంచి ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు మరో గుడ్న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధం అయ్యారు.. చిత్తూరు జిల్లా కుప్పం అనగానే మాజీ సీఎం, సీనియర్ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుకు వస్తుంది.. కొన్ని ఏళ్లుగా కుప్పం చంద్రబాబు అడ్డాగా ఉంది.. అయితే, చంద్రబాబు నియోజకవర్గం నుంచే ఈ సారి వర్చువల్ గా మహిళల ఖాతాల్లో నగదు జమ చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్.. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది మహిళలకు లబ్ధి చేకూరనుండగా.. రూ.4,949.44 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించనుంది ప్రభుత్వం.. రాష్ట్రంలోని 45 నుండి 60 ఏళ్ళ మధ్య వయస్సు గల మహిళలకు ఆర్ధిక సహాయం అందిస్తూ వస్తుంది సర్కార్.. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ. 18,750ల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్ధిక సహాయాన్ని జమ చేస్తూ వస్తున్నారు.. నాలుగేళ్ళలో ఒక్కొక్కరికి మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం అందనుంది.. ఇంత వరకు అందించిన మొత్తం సాయం రూ. 14,110.62 కోట్లుగా ఉంది… మహిళలు ఆర్థిక సాధికారత కొరకు వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్.
Read Also: NTR Health University Name Change: అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాం..!
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది వైఎస్ జగన్ సర్కార్.. ఈ చేయూత పథకం ద్వారా 2020 ఆగస్టులో.. తొలి విడత కింద 24,00,111 మందికి 4,500.21 కోట్లు విడుదల చేయగా.. 2022 జూన్ 22న రెండో విడతగా 24,95,714 మందికి 4,679.49 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.. ఈ రెండు విడతల్లో కలిపి 9179.67 కోట్లను ఇవ్వగా.. మూడో విడతగా సెప్టెంబర్లో లబ్ధిదారులకు 18,750 చొప్పున రేపు వారి అకౌంట్లో జమ చేస్తారు. ఇక, ఇప్పటికే కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన దృష్ట్యా.. అటు అధికార యంత్రాంగంతో పాటు.. ఇటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి… ఎటు చూసినా.. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు, వైసీపీ తోరనాలతో కుప్పం కనిపిస్తోంది..
తాజావార్తలు
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!