Andhra Pradesh: కొత్త ఏడాదిలో దూకుడు పెంచిన జగన్.. పార్టీలో పలు మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కొత్త ఏడాదిలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. దీంతో పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. తొలుత నెల్లూరు జిల్లా రాజకీయాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం నాడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం జగన్ వద్దకు వెళ్లింది. దీంతో కోటంరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే తాను పార్టీపై పబ్లిక్ మీటింగ్లలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు.
Read Also: Singareni: డిసెంబర్లో సింగరేణి ఆల్ టైం రికార్డ్
Also Read
అటు మంగళవారం ఆనం విషయంలో సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆనం రాంనారాయణరెడ్డి విమర్శలు చేస్తుండటంతో వెంకటగిరిలో ఆనంకు చెక్ పెట్టారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా ఆనం స్థానంలో నేదురుమల్లి రాంకుమార్రెడ్డిని సీఎం జగన్ నియమించారు. మరోవైపు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంపైనా సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య విభేదాలు నడుస్తుండటంతో ఇరువురి మధ్య సర్దుబాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. పర్చూరు వెళ్లేందుకు ఇటీవల నిరాసక్తి వ్యక్తం చేసిన ఆమంచి ప్రస్తుతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో చీరాలలో నేతల మధ్య విభేదాలకు సీఎం జగన్ చెక్ పెట్టనున్నారు.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!