CM Jagan: ఏపీలో డ్రగ్స్, గంజాయి అసలు కనిపించకూడదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఎక్సైజ్ శాఖపై క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దన్నారు. ఆ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్ శాఖలు పని చేయాలన్నారు. ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో భారీ హోర్డింగ్స్ పెట్టాలని.. ఎస్ఈబీ టోల్ఫ్రీ నెంబర్ను బాగా ప్రచారం చేయాలని జగన్ సూచించారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలని సీఎం జగన్ తెలిపారు.
Read Also: Etela Rajender: గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన ఎమ్మెల్యే ఈటల
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
వారంలో ఒకరోజు తప్పనిసరిగా పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖలు సమావేశం కావాలని.. వారంలో మరో రోజు పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టాలని సీఎం జగన్ వెల్లడించారు. ఇక నుంచి రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు జరగాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని.. ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలని తెలిపారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలన్నారు. సచివాలయాల మహిళా పోలీసులను కూడా సమన్వయం చేయాలన్నారు. వారిని ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలని హితవు పలికారు. మహిళా పోలీసుల పనితీరు ఇంకా మెరుగుపర్చాలన్నారు. దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థంగా అమలు కావాలన్నారు.
కాగా సీఎం జగన్ మంగళవారం నాడు విజయవాడలో పర్యటించనున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం 5:20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్కు చేరుకోనున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!