Etela Rajender: గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన ఎమ్మెల్యే ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మికుల సమస్యలను జిహెచ్ఎంసి కార్మిక సంఘాలతో కలిసి గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ దృష్టికి తీసుకొని వెళ్ళారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 20 సంవత్సరాల పాటు వెట్టి చాకిరి చేయించుకుని.. పేద బడుగు, బలహీన వర్గాల చెందినవారు అని కూడా చూడకుండా తొలగిస్తున్నారు. ఈ కార్మికులు ఎక్కువమంది దళితులే ఉంటారు. వారిపట్ల జాలీ, దయ చూపించకుండా డ్రైవర్లను,లేబర్లను ఉద్యోగాల నుంచి తీసివేసి రోడ్డు మీద పడవేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మున్సిపల్ కార్మికులను.. ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడం పట్ల వెంటనే కలుగజేసుకొని.. వారి ఉద్యోగాలు, జీవితాలు నిలబడేలాగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారిని కోరినట్లు ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Minister Mallareddy: కేసీఆర్ ప్రధాని కావాలి.. జోగులాంబను కోరుకున్నా!
Also Read
తెలంగాణ వచ్చిన వెంటనే వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు అసలే ఉద్యోగాల నుంచి తీసివేయడం దుర్మార్గమని వారు అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మికులను తొలగిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న ధర్నాలో పాల్గొని మాట్లాడి.. కెసిఆర్ తో చర్చించి వారిని తిరిగి ఉద్యోగాలకు తీసుకొనేలా చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వీరికి అన్యాయం జరగకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసి కార్మిక సంఘం నేతలు గోపాల్ తదితరులతో కలిసి ఈరోజు ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. వారి ఉద్యోగాలు తొలగించకుండా చూడాలని గవర్నర్ తమిళిసైని కోరారు ఈటల రాజేందర్.
Mla Etela, Etela Rajender, Governor Tamilisai, GHMC, Employees, Dalits, Permanent Jobs, Governor, Contract Labour, drivers
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!