Jagan Davos Tour: టెక్ మహింద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
సీఎం జగన్ దావోస్ పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో జగన్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని జగన్ రిక్వెస్ట్ చేయగా.. గుర్నాని సానుకూలంగా స్పందించారు.
టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
విశాఖను మేజర్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పంతో ఉన్నారని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో గుర్నాని వివరించారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారని ఆయన తెలిపారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని శ్రమిస్తున్నారని.. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారన్నారు.

మరోవైపు దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్తో సీఎం జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడుల విషయంపై వివరించారు. మరోవైపు స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అవకాశాలపై సీఎం జగన్తో స్విస్ పార్లమెంట్ ప్రతినిధి బృందం చర్చించింది.
స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ.
భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో సీఎం సమావేశం.
ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో చర్చించిన బృందం.#CMYSJaganInDavos #APatWEF22 #AndhraPradesh pic.twitter.com/9b0VJoewvL— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
మరోవైపు ఓఎస్కే లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తకీషి హషిమొటోతో మాట్లాడుతూ.. షిప్పింగ్, లాజిస్టిక్స్ వ్యాపార రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అవకాశాలపై చర్చించామన్నారు. ఏపీకి గొప్ప అవకాశాలున్నాయని.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి తమకూ అవకాశం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. తాము భారత్లో పూర్తిస్థాయి కంపెనీని పెట్టామని.. ఏపీలో ఈ కంపెనీ ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఏపీకి పొడవైన తీరప్రాంతం ఉందని.. కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా ఈ రంగంలో వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయని తకీషి హషిమొటో వివరించారు.
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?