AP CID: ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు.. చంద్రబాబును ఏ1గా చేర్చిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది.. తాజాగా, అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ను చేర్చింది సీఐడీ.. వారిపై 120బీ, 420, 34, 35, 36, 37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ధి కల్గించారని ఆరోపించారు.. కాగా, 454 కిలోమీటర్ల పాటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించాలని తలపెట్టారు…. కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చిక్కుకుంటుంది.. అలైన్మెంట్, భూసేకరణ.. లాంటి అంశాలకు వివాదానికి కారణంగా మారిపోయాయి.
Read Also: Massoda Movie Review: మసూద
Also Read
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
మరోవైపు, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్లో విచారిస్తున్నారు ఏపీ సీఐడీ పోలీసులు.. హైకోర్టు ఆదేశాలతో ఉదయం 11.30 నుండి విచారణసాగుతోంది.. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో అవతవకలపై ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నోటీసు ఇచ్చింది సీఐడీ.. కాగా, నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల శస్త్రచికిత్స పూర్తవడంతో సీఐడీ విచారణకు హాజరు కాలేరంటూ హైకోర్టుకి తెలిపారు నారాయణ తరుపు న్యాయవాదులు.. ఇక, హైకోర్టు నారాయణను ఇంట్లో విచారించవచ్చు అని చెప్పడంతో ఇవాళ ఉదయం 11 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు విచారిస్తోంది సీఐడీ బృందం.. హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఓ అపార్ట్మెంట్లో నారాయణ నివాసం ఉంటుంటున్నారు.. అక్కడికే వెళ్లి ప్రశ్నిస్తున్నారు సీఐడీ పోలీసులు.
తాజావార్తలు
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!