AP CID: ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు.. చంద్రబాబును ఏ1గా చేర్చిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది.. తాజాగా, అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ను చేర్చింది సీఐడీ.. వారిపై 120బీ, 420, 34, 35, 36, 37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ధి కల్గించారని ఆరోపించారు.. కాగా, 454 కిలోమీటర్ల పాటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించాలని తలపెట్టారు…. కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చిక్కుకుంటుంది.. అలైన్మెంట్, భూసేకరణ.. లాంటి అంశాలకు వివాదానికి కారణంగా మారిపోయాయి.
Read Also: Massoda Movie Review: మసూద
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
మరోవైపు, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్లో విచారిస్తున్నారు ఏపీ సీఐడీ పోలీసులు.. హైకోర్టు ఆదేశాలతో ఉదయం 11.30 నుండి విచారణసాగుతోంది.. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో అవతవకలపై ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నోటీసు ఇచ్చింది సీఐడీ.. కాగా, నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల శస్త్రచికిత్స పూర్తవడంతో సీఐడీ విచారణకు హాజరు కాలేరంటూ హైకోర్టుకి తెలిపారు నారాయణ తరుపు న్యాయవాదులు.. ఇక, హైకోర్టు నారాయణను ఇంట్లో విచారించవచ్చు అని చెప్పడంతో ఇవాళ ఉదయం 11 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు విచారిస్తోంది సీఐడీ బృందం.. హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఓ అపార్ట్మెంట్లో నారాయణ నివాసం ఉంటుంటున్నారు.. అక్కడికే వెళ్లి ప్రశ్నిస్తున్నారు సీఐడీ పోలీసులు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!