AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన కేబినెట్.. వృద్ధాప్య పెన్షన్ పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. రూ.2,500 పెన్షన్ను వచ్చే నెల నుంచి రూ.2,750కి పెంచుతున్నట్లు కేబినెట్ ప్రకటించింది. ఫలితంగా 62.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూంలను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
అయితే కేబినెట్ అజెండా పూర్తయిన తర్వాత కాసేపు మంత్రులతో సీఎం జగన్ రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం కోసం సీరియస్గా పనిచేస్తే మీకే మంచిదని ఆయన హితవు పలికారు. మంత్రులు ఎక్కువ బాధ్యతగా ఉండాలన్నారు.
Also Read
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
- CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
Read Also: Janasena Party: ‘యువశక్తి’ పేరుతో జనవరి 12న పవన్ భారీ బహిరంగ సభ
అటు రాష్ట్రంలో దుష్టచతుష్టయం తీరుపై కేబినెట్లో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పూర్తి పారదర్శకంగా ఉండాలని.. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలను పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ 21న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ప్రతి స్కూల్కు వెళ్లి అందించాలని ఆదేశించారు. పెంచిన పెన్షన్, వైఎస్ఆర్ ఆసరాను నేరుగా లబ్ధిదారులకు అందించాలని తెలిపారు. మంత్రులు ఇంఛార్జులుగా ఉన్న జిల్లాల్లోనూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పార్టీలో నేతల మధ్య విభేదాలుంటే ఇంఛార్జ్ మంత్రులు పరిష్కరించాలని సీఎం జగన్ అన్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
-
IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!