AP Assembly Last Day: ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాడివేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇవాళ సభలో 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభ ముందుకు రానుంది సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి కాగ్ నివేదికను సభ ముందు ఉంచనుంది ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.
Read Also: Vizag Smart Scam Update: విశాఖ స్మార్ట్ యోజన కేసులో సీఐడీ దూకుడు
Also Read
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Off The Record: కాపు రిజర్వేషన్స్ పై ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలనుకున్నారా..!
- Pawan Kalyan: మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం.. పవన్ హర్షం.. గ్రేట్ గ్రీన్ వాల్పై కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. సభలో చర్చ జరగకుండా అడ్డుపడిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేస్తూనే వున్నారు. సమావేశాలు ప్రారంభం నుంచి టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తూనే వున్నారు. గొడవ చేయడం ద్వారా త్వరగా సస్పెండ్ అయి బయటకు వెళ్లిపోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మంగళవారం కూడా హంగామా చేశారు.
దీనిపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఉదయం నుంచి టీడీపీ సభ్యుల ప్రవర్తన అలాగే వుందని, ప్రీ ప్లాన్డ్ గా సభనుంచి బయటకు వెళ్లాలని వారు భావిస్తున్నారన్నారు. మధ్యాహ్నం పెగాసస్ వ్యవహారంపై మధ్యంతర నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రవేశపెట్టినప్పుడు కూడా సేమ్ సీన్. దీంతో టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. ఇవాళ చివరిరోజయినా సభ సజావుగా సాగుతుందని భావిస్తున్నారు. అటు శాసనమండలి సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగుస్తాయి.
Read Also: Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్లో లుకలుకలు.. సీఎం పదవిని కాపాడుకునే ప్రయత్నంలో గెహ్లాట్
తాజావార్తలు
-
Fauzi premieres : వరల్డ్ వైడ్గా ఒకరోజు ముందుగానే ‘ఫౌజీ’ ప్రీమియర్స్.. కన్ఫామ్ చేసిన మైత్రి రవి
-
Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
-
Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్దీప్-సమ్రీన్ రిలేషన్పై మళ్లీ చర్చ..!
-
Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
-
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!