AP Assembly Last Day: ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాడివేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇవాళ సభలో 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభ ముందుకు రానుంది సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి కాగ్ నివేదికను సభ ముందు ఉంచనుంది ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.
Read Also: Vizag Smart Scam Update: విశాఖ స్మార్ట్ యోజన కేసులో సీఐడీ దూకుడు
Also Read
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- OTR : ధర్మవరంలో పోటీ టీడీపీ వర్సెస్ బీజేపీ అవుతుందా?
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. సభలో చర్చ జరగకుండా అడ్డుపడిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేస్తూనే వున్నారు. సమావేశాలు ప్రారంభం నుంచి టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తూనే వున్నారు. గొడవ చేయడం ద్వారా త్వరగా సస్పెండ్ అయి బయటకు వెళ్లిపోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మంగళవారం కూడా హంగామా చేశారు.
దీనిపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఉదయం నుంచి టీడీపీ సభ్యుల ప్రవర్తన అలాగే వుందని, ప్రీ ప్లాన్డ్ గా సభనుంచి బయటకు వెళ్లాలని వారు భావిస్తున్నారన్నారు. మధ్యాహ్నం పెగాసస్ వ్యవహారంపై మధ్యంతర నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రవేశపెట్టినప్పుడు కూడా సేమ్ సీన్. దీంతో టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. ఇవాళ చివరిరోజయినా సభ సజావుగా సాగుతుందని భావిస్తున్నారు. అటు శాసనమండలి సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగుస్తాయి.
Read Also: Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్లో లుకలుకలు.. సీఎం పదవిని కాపాడుకునే ప్రయత్నంలో గెహ్లాట్
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!