Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- 2027 జూన్ నాటికి పూర్తి లక్ష్యం
- కేంద్రం నుంచి రూ.3,300 కోట్ల అదనపు నిధులు
- న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
- పునరావాసం, నిర్మాణ పనులకు వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన అద్భుత ప్రతిభపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పైగా మెరుగుపడడం విశేషమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని ఆయన విశ్లేషించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న కార్యాచరణను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా పరీక్షలకు ముందు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు తీసుకువచ్చిన ‘100 రోజుల ప్రణాళిక’ , తల్లిదండ్రులను విద్యా ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు నిర్వహించిన ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’ వంటి కార్యక్రమాలు విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించాయని ఆయన కొనియాడారు.
ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం పట్ల పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది అది 78.39 శాతానికి పెరగడం గమనార్హం. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులకు ఆయన అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల చదువుల పట్ల ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!