Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- 2027 జూన్ నాటికి పూర్తి లక్ష్యం
- కేంద్రం నుంచి రూ.3,300 కోట్ల అదనపు నిధులు
- న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
- పునరావాసం, నిర్మాణ పనులకు వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన అద్భుత ప్రతిభపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పైగా మెరుగుపడడం విశేషమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని ఆయన విశ్లేషించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న కార్యాచరణను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా పరీక్షలకు ముందు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు తీసుకువచ్చిన ‘100 రోజుల ప్రణాళిక’ , తల్లిదండ్రులను విద్యా ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు నిర్వహించిన ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’ వంటి కార్యక్రమాలు విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించాయని ఆయన కొనియాడారు.
ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం పట్ల పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది అది 78.39 శాతానికి పెరగడం గమనార్హం. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులకు ఆయన అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల చదువుల పట్ల ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!