10th Exam Schedule: విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..!
- పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు
- గణితం 23న, సైన్స్ 25 & 28న
- విద్యార్థుల కోసం కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2026 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్సీ (SSC), ఓఎస్ఎస్సీ (OSSC) , వొకేషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీన ప్రారంభమై, ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్ను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగానే ఈ టైమ్ టేబుల్ను ప్రకటించింది.
పరీక్షలన్నీ ఉదయం 09:30 గంటలకు ప్రారంభమవుతాయి. మెజారిటీ ప్రధాన పరీక్షలు మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్తో పరీక్షలు మొదలవుతాయి. ఆ తర్వాత మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు అత్యంత కీలకమైన గణిత పరీక్ష మార్చి 23న జరగనుంది. సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ పరీక్షను మార్చి 25న, బయోలాజికల్ సైన్స్ పరీక్షను మార్చి 28న నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. సోషల్ స్టడీస్ పరీక్ష మార్చి 30న జరుగుతుంది.
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
RRB Group D: రైల్వేలో 22,000 గ్రూప్ డి పోస్టులు.. కొత్త అప్లికేషన్ డేట్ ఇదే
ప్రధాన సబ్జెక్టుల అనంతరం, మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II , ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-IIతో పాటు ఎస్ఎస్సీ వొకేషనల్ కోర్సు థియరీ పరీక్షలతో ఈ పబ్లిక్ పరీక్షల పర్వం ముగుస్తుంది. సైన్స్ పరీక్షలు, వొకేషనల్ కోర్సుల వంటి కొన్ని నిర్దిష్ట పేపర్లకు మాత్రం ముగింపు సమయం మధ్యాహ్నం 11:15 లేదా 11:30 గంటల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణపై విద్యా బోర్డు కొన్ని కీలక సూచనలు చేసింది. అకడమిక్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులు ఎస్ఎస్సీ , ఓఎస్ఎస్సీ విద్యార్థులకు ఉమ్మడిగా ఉంటాయని పేర్కొంది. ఈ పరీక్షల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుల జాబితా-2026కు లోబడి ఉంటుంది. పరీక్షా సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, తమకు కేటాయించిన సరైన ప్రశ్నపత్రాన్నే అడిగి తీసుకోవాలని బోర్డు హెచ్చరించింది.
పొరపాటున తప్పుడు ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తే, వారి ఫలితాలను రద్దు చేసే అవకాశం ఉంటుందని, ఆ బాధ్యత విద్యార్థులదేనని అధికారులు తేల్చి చెప్పారు. ఈ షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాయాలని సూచించారు.
PM Modi: ప్రధాని, సీఎంగా కాకుండా.. అలా ఉండటానికి గొప్ప గర్వంగా ఉంటుంది
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!