ఏపీకి మరో 9 లక్షల కరోనా టీకా డోసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి మరో 9 లక్షల కొవిడ్ టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి కొవిషీల్డ్ టీకా డోసులు. దిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు.. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనుంది వ్యాక్సిన్.. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలుగనుంది. కాగా ఏపీలో గత 24 గంటల్లో 87,756 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 6617 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 57 మంది మృతిచెందారు.. మరోవైపు.. 24 గంటల్లో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,23,856 కు చేరుగా.. ఇప్పటి వరకు 12,109 మంది మృతిచెందారు.. రికవరీ కేసులు 17,40,281 కు పెరగగా.. ప్రస్తుతం 71,466 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Tags
- 9 lakh
- ap
- corona vaccine
- Covid 19
తాజావార్తలు
-
Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
-
Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
-
Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
-
Kedar Jadhav: సచిన్తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
-
Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్ బాద్షా గురించి ఆసక్తికర విషయాలు..