Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్..
- పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్..
- ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన పోలీసులు..
- విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి. పోసాని కృష్ణ మురళిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఇక, పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Amitabh Bachchan : రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
అయితే, పార్వతీపురం జిల్లాలోని పాలకొండ పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురళిపై 2024లో కేసు నమోదు అయింది. ఈ నెల 12వ తేదీన పాలకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుట హాజరు కావాలంటూ ఫిబ్రవరి 7వ తేదీన నోటీసులు జారీ చేశారు. కానీ, పోసాని విచారణకు సహకరించడం లేదని ఓబులవారిపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 14 కేసులు నమోదు అయ్యాయి. నాలుగు కేసులలో ఆయనకి వ్యతిరేకంగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.. పోసానిని హైదరాబాదులో అరెస్టు చేసిన సమయంలో అరెస్ట్ ఇంటిమేషన్ కాపీని కుటుంబ సభ్యులు తీసుకోలేదు.. అందుకే ఇంటిమేషన్ కాపీని ఆయన కొడుకు వాట్సాప్ కు పంపించామని రైల్వే కోడూరు కోర్టుకు ఇచ్చిన పోసాని రిమాండ్ కాపీలో పేర్కొన్న వివరాలను పోలీసులు వెల్లడించారు.
Read Also: TG Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్
ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాలో పోసాని కృష్ణ మురళిపై మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. విశాఖ వన్ టౌన్, పద్మనాభం, పాడేరు, నర్సీపట్నం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. వన్ టౌన్లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కంప్లయింట్ చేయగా.. పద్మనాభంలో చిన్ని వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. ఇక, నర్సీపట్నంలో కే. మరుడయ్య, పాడేరులో పాండు రంగ స్వామి ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!