TG Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్
- తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు
- ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్
- అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5వ తేది నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సమీక్షించారు. ఈ సమీక్షలో ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ శ్రీ. కృష్ణ ఆదిత్య, జిల్లాల కలెక్టర్ లు, డిజిపి తెలంగాణ, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ లు. జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షా నిర్వహణ కమిటీలు వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Also Read:Krithi Shetty: తెలుగొద్దు.. తమిళమే ముద్దు!
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ఇంటర్ పరీక్షలపై జరిపిన సమీక్షలో సీఎస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలని, పరీక్షలు సజావుగా జరిపేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, జిల్లా అధికారులతో పరీక్షా నిర్వహణకు సమీక్షాసమావేశాలు నిర్వహించి రెవెన్యూ, పోలీస్, పోస్టల్, వైద్య, రవాణా, విద్యుత్ అధికారులకు ముందస్తు ఏర్పాట్లకై సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.
Also Read:England: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విఫలం.. కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా
చేతి గడియారంతో సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడవన్నారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ లను అనుమతించడం, ఉపయోగించడంపై నిషేదం విధించామన్నారు. బోర్డ్ అధికారులు ముందస్తుగా అనుమతించిన విద్యార్ధులకు సహాయకులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో ఉంచడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని సీసీ కెమెరాల ద్వారా 24/7 పర్యవేక్షించి.. అక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!