Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్..
- పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్..
- ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన పోలీసులు..
- విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి. పోసాని కృష్ణ మురళిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఇక, పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Amitabh Bachchan : రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
అయితే, పార్వతీపురం జిల్లాలోని పాలకొండ పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురళిపై 2024లో కేసు నమోదు అయింది. ఈ నెల 12వ తేదీన పాలకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుట హాజరు కావాలంటూ ఫిబ్రవరి 7వ తేదీన నోటీసులు జారీ చేశారు. కానీ, పోసాని విచారణకు సహకరించడం లేదని ఓబులవారిపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 14 కేసులు నమోదు అయ్యాయి. నాలుగు కేసులలో ఆయనకి వ్యతిరేకంగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.. పోసానిని హైదరాబాదులో అరెస్టు చేసిన సమయంలో అరెస్ట్ ఇంటిమేషన్ కాపీని కుటుంబ సభ్యులు తీసుకోలేదు.. అందుకే ఇంటిమేషన్ కాపీని ఆయన కొడుకు వాట్సాప్ కు పంపించామని రైల్వే కోడూరు కోర్టుకు ఇచ్చిన పోసాని రిమాండ్ కాపీలో పేర్కొన్న వివరాలను పోలీసులు వెల్లడించారు.
Read Also: TG Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్
ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాలో పోసాని కృష్ణ మురళిపై మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. విశాఖ వన్ టౌన్, పద్మనాభం, పాడేరు, నర్సీపట్నం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. వన్ టౌన్లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కంప్లయింట్ చేయగా.. పద్మనాభంలో చిన్ని వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. ఇక, నర్సీపట్నంలో కే. మరుడయ్య, పాడేరులో పాండు రంగ స్వామి ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..