Madanapalle Kidney Racket: ఏపీలో మరో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు.. మహిళ మృతితో..!
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం..
- మదనపల్లిలో విశాఖ మహిళలకు కిడ్నీల తొలగింపు..
- కిడ్నీ తొలగించడంతో యమున అనే మహిళ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విశాఖపట్నం నుంచి మదనపల్లికి మహిళలను తీసుకొచ్చిన కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలను మదనపల్లిలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. అయితే.. కిడ్నీ తొలగించడంతో యమున అనే మహిళ మృతి చెందింది. యమున కుటుంబ సభ్యులు మదనపల్లి టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Dubai: దుబాయ్ ఎడారిలో రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త దంపతులు హత్య.. అసలేం జరిగిందంటే..!
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
విశాఖకు చెందిన పద్మ.. ఇద్దరు మహిళలను మదనపల్లికి తీసుకొచ్చింది. వారికి ఆపరేషన్ చేసిన తర్వాత యమున మృతి చెందింది. దీంతో.. అక్రమ ఆపరేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లి పోలీసులు కిడ్నీ రాకెట్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ లో కీలక నిందితుడిగా నీరజ్ అనే వ్యక్తిని గుర్తించారు. మరోవైపు కిడ్నీ ముఠాతో కలిసి పని చేస్తున్న గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు కిడ్నీ ముఠాకు పద్మ అనే మహిళ సహకరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పద్మ పరారీలో ఉండగా.. ఆమె కోసం గాలిస్తున్నారు.
Read Also: Heartbreaking: ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ఏం చేశారంటే..
అయితే, మదనపల్లిలో కిడ్నీ అమ్మకం పై పోలీసుల విచారణ కొనసాగుతోంది.. ఇది కిడ్నీ రాకెట్ కాదని తెలిసిన కుటుంబ సభ్యులే మార్పిడికి అంగీకరించిన డబ్బులు ఇవ్వకపోవడంతోని సమస్య బయటపడిందంటున్నారు పోలీసులు.. నగదు లావాదేవీలలో వచ్చిన తేడాతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది అంటున్నారు.. మృతి చెందిన యమునా వైజాగ్ లో ఓ కిరాణా స్టోర్ లో వర్క్ చేసేది.. భర్త చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తామంటూ బ్రోకర్ ప్రలోభాలకు గురిచేశాడు.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలు తొలగించినట్ల సమాచారం… మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో అక్రమ ఆపరేషన్ జరగగా.. ఆపరేషన్ తర్వాత యమునే అనే మహిళ మృతి చెందడంతో కిడ్నీ ముఠా దందా బయటకు వచ్చింది.. గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. డాక్టర్లు సహా నిందితులను అదుపులోకి తీసుకుని మదనపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!