Dubai: దుబాయ్ ఎడారిలో రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త దంపతులు హత్య.. అసలేం జరిగిందంటే..!
- దుబాయ్ ఎడారిలో రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త దంపతులు హత్య
- అక్టోబర్ 2న అదృశ్యం.. నెల రోజుల తర్వాత గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త రోమన్ నోవాక్, అతని భార్య అన్నా నోవాక్ దుబాయ్లో హత్యకు గురయ్యారు. దుబాయ్ ఎడారిలో శరీరం ముక్కలు ముక్కలుగా నరికివేయబడినట్టుగా మృతదేహాలు కనిపించాయి. ప్రతీకారంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
పెట్టుబడిదారులతో సమావేశానికి వెళ్తున్నట్లుగా అక్టోబర్ 2న రోమన్ నోవాక్ దంపతులు దుబాయ్కు వెళ్లారు. కారు డ్రైవర్ ఒమన్ సరిహద్దుకు దగ్గరగా హట్టా ప్రాంతంలో ఒక సరస్సు దగ్గర దింపాడు. అక్కడ నుంచి రెండో వాహనంలో బయల్దేరి వెళ్లారు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే తాను ఒమన్ సరిహద్దులోని పర్వతాల్లో చిక్కుకున్నానని.. తనకు డబ్బులు అవసరం అంటూ పరిచయస్తులకు రోమన్ నోవాక్ సందేశం పంపించాడు. దీంతో బంధువులు వెతుక్కుంటూ వచ్చినా సమాచారం లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫోన్ సిగ్నల్ ట్రాప్ చేయగా.. ఒకసారి హట్టాలోనూ.. ఇంకోసారి ఒమన్లో.. మరొకసారి దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అక్టోబర్ 4 నుంచైతే పూర్తిగా సిగ్నల్స్ కట్ అయిపోయాయి.
Also Read
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
- Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
- El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
అప్పటి నుంచి దంపతుల ఆచూకీ కోసం వెతుకుతుండగా తాజాగా దుబాయ్ ఎడారిలో మృతదేహాలు లభించాయి. భార్యాభర్తల శరీరాలు ముక్కలు ముక్కలుగా నరికేశారు. అయితే వ్యాపార లావాదేవీల్లో భాగంగానే దుండగులు కుట్ర పన్ని ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే పెట్టుబడిదారుల ముసుగులో ఆకర్షించి ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
రోమన్ నోవాక్..
రోమన్ నోవాక్ కూడా దోషిగా తేలిన మోసగాడే. ఫింటోపియో అనే ప్లాట్ఫామ్ను స్థాపించాడు. రష్యా, చైనా, పశ్చిమాసియా నుంచి పెట్టుబడులు ఆకర్షించాడు. అనంతరం 500 మిలియన్లతో పారిపోయాడు. భారీ మోసానికి పాల్పడినందుకు 2020లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. సెయింట్ పీటర్స్బర్గ్ జైల్లో ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. పెరోల్ మంజూర్ కాగానే 2023లో యూఏఈకి పారిపోయాడు. చివరికి ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!